భక్తిశ్రద్ధలతో దత్తాత్రేయస్వామి జయంతి ఉత్సవాలు
జడ్చర్ల, డిసెంబరు 4 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాభిషేకం, అలంకరణ, సహస్రనామ ఆర్చన సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తరువాత భక్తులంతా కలిసి మహా నైవేద్యం సమర్పించారు.

