రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇంకా ప్రైవేటు వ్యక్తుల రాజ్యం

 *మానవా.. మారవా..!?* 


 *ఆగని డాక్యుమెంట్ కలెక్షన్లు..!* 


 *పాలకులు.. పై అధికారులు పట్టించుకోరా..?* 


 *సామాన్యుల గోడు వినిపించుకోరా..?* 


 * అక్రమ వసూళ్ల దందా నిలిపివేయరా..?* 

 *ఫరూక్ నగర్ కార్యాలయం నుండి ప్రైవేటు వ్యక్తులను తీసివేసిన అధికారి* 

 *షాద్ నగర్ సబ్ ఒప్పందం ఇంకా ప్రైవేటు వ్యక్తుల రాజ్యం* 

షాద్ నగర్, జూన్ 11 మనఊరు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, ఫరూక్ నగర్ ప్రభుత్వ సబ్‌బిషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమ దందాపై మీడియాలో వరుస కథనాలు అయినప్పటికీ అధికారుల్లో సిబ్బందిలో మార్పు రావడం లేదు. కలెక్షన్లే తమ ముఖ్యమైన ఎజెండాగా ముందుకు సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా వీళ్ళు మారుతారు అనుకుంటే పొరపాటే.. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టు ఉంది సబ్ స్టాండింగ్ సిబ్బంది తీరు. జనాలను ఇబ్బంది పెట్టొద్దని ముక్తకంఠంతో షాద్ నగర్ నియోజకవర్గ ప్రజానీకం కోరుతుంటే.. తమకేమీ పట్టనట్లు దుస్తులపై దుమ్ము దులుపుకున్నట్లు కొన్ని సార్లు ముందుకు పోతున్నారు అనే విమర్శ బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వం చేసిన పనికి సిబ్బందికి జీతాలు ఇస్తుంటే అవి కాదని ప్రజలకు సేవలు చేయడానికి కొత్త రూల్ పెట్టుకుని దస్తావేజుకు ఇంత ఇవ్వాల్సిందే కట్టి ముక్కుపిండి మరియు వసూలు చేస్తున్న ఈ వసూల్ రాజాల బాగోతంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఓవైపు ప్రైవేట్ వ్యక్తుల కార్యాలయాల్లో పనులకు పురమాయిస్తూ వారిచేత కలెక్షన్లు రాబడుతూ ఇప్పటిదాకా అక్రమ దందా సాగించిన షాద్ నగర్ ఫరూక్ నగర్ సబ్ రిజిస్ట్రీ కార్యాలయాల ఔన్నత్యం పై అటు పై అధికారులు ఇటు పాలకులు నోరు మెదపకపోవడం. అందినంత దోచుకో దోచుకుంది దాచుకో అన్న చందంగా కుక్క తోక వంకర అన్నట్టు అక్రమ కలెక్షన్లు మాత్రం ఆగడం లేదు.

ఇప్పటికే వ్యక్తుల కార్యాలయంలో అక్రమంగా విధులు నిర్వహిస్తున్నారు అన్న వార్తలపై ఫరూక్ నగర్ రిజిస్ట్రేషన్ వారిని అధికారి తొలగించారు. అదేవిధంగా ఫరూక్ నగర్ పనిచేస్తున్న సిబ్బంది కూడా అలాగే నిన్న విధులు నిర్వహించారు. షాద్ నగర్ గోపాల్, వెంకటేష్ (హైదరాబాద్) శ్రీను, చైతన్య అనే వ్యక్తులు ప్రభుత్వ సేవలు అందించారు. ఫరూక్ నగర్ నియామక శేఖర్ నందు సునీల్ రఘు సాయి రవిలను సదరు అధికారి నిన్ననే పనుల్లోంచి తొలగించారు. నిన్న జరిగిన డాక్యుమెంటేషన్ సందర్భంగా సాయంత్రానికి మళ్లీ పైసా వసూల్ కార్యక్రమం యధావిధిగా కొనసాగుతోంది. మానవ మారవ అంటే మనము అనే సమాధానమే వినిపిస్తోంది. కుక్క తోక వంకర అన్న చందంగా లంచ్ అవతారాలు లంచాలు యధావిధిగా మింగుతూనే ఉన్నారు. 

 *ప్రజలను పీడించి ఏం సాధిస్తారు..!?*

ఇళ్ల స్థలాల కోసం ఆయా కార్యాలయాలకు వస్తున్న అమాయక ప్రజలు తమ పనులు నిబద్ధతతో కూడిన నిబంధనల ప్రకారం జరుగుతుందని భావించారు. అయితే ఇక్కడ మాత్రం సిబ్బంది రాబందుల పీక్కుతింటున్నారు. ప్రతి దస్తావేజుకు ప్రతి పనికి ఇంత అని ఏకంగా డాక్యుమెంట్ రైటర్ల ద్వారా వసూలు చేస్తున్నారు. ఈతతంగం వరుస కథనాల పరంగా వెలుగోడుతున్న పై అధికారులు చలనం లేకపోవడంతో వారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో అసలు ఏం జరుగుతుంది అని జనాలు ఆరాతీస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారి లంచం అడిగితే చెప్పుతో కొట్టండి అని చెప్పిన కేసీఆర్ అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగుల లంచాలకు ఎగబడితే కర్రు కాల్చి వాత పెడతా అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి వారు పరిపరి విధాలుగా చెబుతున్న తగిన విధాలుగా మాత్రం లంచాలు తీసుకోకుండా ఉండడం లేదు. ప్రజల వద్ద ముక్కు పిండి వసూలు చేస్తున్న పైసా వసూల్ వీరి పైకి ఎలా పడుతుంది అని సామాన్య జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇలా దోచుకుని తింటే వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు మంచిదా అని ప్రశ్నిస్తున్నారు. పైసా పైసా కూడా పెట్టి ఎన్నో కలలుకని ఇండ్ల స్థలాలు కొంటుంటే రాబందుల పీక్కుతింటున్న వీరి అక్రమ పైత్యానికి దేవుడు అనే వాడు ఒకడుంటే నాశనం అవుతారని శాపనార్ధాలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోవని తమ నోర్లు కొట్టి తాము పైసా పైసా కూడా పెట్టుకున్న కష్టాన్ని దోచుకుంటున్న వీళ్ళ తీరుపై ప్రభుత్వం పై అధికారులు అని అడుగుతున్నారు. లంచాలు తినేటోళ్ల ఇంట్లో పీనుగేళ్ల అని జనాలు శాపనార్ధాలు పెడుతున్నారు. లంచాలు మానండి అని చిలుకలకు చెప్పినట్టు చెబుతున్నారు. అవసరమైతే స్వచ్ఛంద సేవా సంస్థలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ముట్టడించి తాళాలు వేస్తాము. నిజాయితీగా ఒప్పందం చేయాల్సిన అధికారులు ఫైళ్లకు కేసులు పెట్టి అడ్డగోలు ఆటంకాలు సృష్టించి డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం చెప్పారు. ఎన్నో ఆశలతో చెల్లించాలని ప్రజలు వస్తుండగా లక్షల రూపాయల లావాదేవీలు చివరగా ఖరీదు చేసుకుంటే వాళ్ళు ఎంతో మానసికంగా బాధపడుతున్నారు. లక్షలు గుమ్మరించి ప్లాట్లు కొంటున్న ఐదు పదివేలకు ఏం వచ్చింది అక్కడ వాళ్ళ బొందలకు తగిలేయండి ఏం గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకుంటున్నారు. ఇంత జరిగిన వీళ్లు మారలేదు..

Previous Post Next Post