అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య..

 *చార్మినార్ లొ భారీ అగ్నిప్రమాదం, 17 మంది మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం*

*మొత్తం 17 మంది మృతిచెందగా.. అందులో 8 మంది చిన్నారులే*



హైదరాబాద్, మే 18 (మనఊరు ప్రతినిధి): నగరంలోని పాతబస్తీ చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని 8 మంది మృతిచెందినట్లు సమాచారం.

గుల్జార్ హౌస్ కృష్ణ పెరల్స్ & మోడీ పెరల్స్ లో మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురు చిన్నారులు సహా 16 మందిని రక్షించి హాస్పిటల్స్‌కు తరలించారు. ఇంకా లోపల ఉన్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

మంటల్లో చిక్కుకున్న పలువురిని పోలీసులు, అధికారులు కాపాడారు. వారిని చికిత్స నిమిత్తం మలక్ పేట యశోద, ఉస్మానియా హాస్పిటల్, అపోలో, డీఆర్‌డీవో ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్ లోపల 30 మంది వరకు ఉన్నట్టు సమాచారం. మొదట ఏడుగురిని రెస్క్యూ చేసి హాస్పటల్‌కు తరలించారు. ఆపై మరో తొమ్మిది మందిని భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. కాలిన గాయాలైన వారిని ఆసుపత్రులకు తరలించారు.

ముగ్గురు చిన్నారులు సహా 16 మందిని పలు ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. హాస్పిటల్ కు తరలించిన వారిని పరీక్షించిన వైద్యులు కొందరు చనిపోయినట్లు నిర్ధారించారు. పొగ పీల్చడంతో ఊపిరితిత్తుల్లోకి చేరగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

ప్రహ్లాద్ (70), మున్ని (70), రాజేందర్ మోదీ (65), సుమిత్ర (60), హమేయ్ (7), అభిషేక్ (31), శీతల్ (35), ప్రియాన్ష్ (4), ఇరాజ్ (2), ఆరూష్ (3), రిషబ్ (4), ప్రథమ్ (1.5), అనుయాన్ (3), వర్ష (35), పంకజ్ (36), రజిని (32), ఇడ్డు (4)లు కాగా, ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చార్మినార్‌లోని గుల్జర్ హౌస్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. 17మంది ప్రాణాలు కోల్పోగా.. మృతుల్లో 8 మంది చిన్నారులే ఉండటం బాధాకరం

 10 ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా చార్మినార్ వెళ్లే ప్రధాన మార్గాలను పోలీసులు తాత్కాలికంగా క్లోజ్ చేశారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. మొదటి అంతస్తులో నివసిస్తున్న పలువురు స్పృహ కోల్పోయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జీ+2 భవనంలో మంటలు చెలరేగాయి. కింది అంతస్తులో మంటలు చెలరేగి.. పై అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో చాలా మంది చిక్కుకున్నారు. వీరిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది తీవ్రంగా గాయపడినట్లు అగ్ని మాపక సిబ్బంది తెలిపారు. క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, తెలంగాణ రాష్ట్ర మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు స్పందించారు. కేంద్ర ప్రభుత్వం క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతులకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

Post a Comment

Previous Post Next Post