ఫుడ్ పాయిజన్ అసలు కారణం ఇదే..!
కాలం చెల్లిన పాలతోనే పెరుగు తోడు.
- గంట తరువాత 65 మందికిపైగా విద్యార్థుల అస్వస్థత
- జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలింపు
నాగర్ కర్నూల్, జూలై 27 (మనఊరు ప్రతినిధి): నాగర్ కర్నూల్ బీసీ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజాన్ అసలు కారణం కాలం చెల్లిన పాలతో పెరుగు తోడు వేయడమే. సంకేతాలు సాయంత్రం స్నాక్స్ ఊడికి ఉడకని క్యాబేజీతో కూడిన పకోడ తిన్న విద్యార్థులు రాత్రి కాలం చెల్లిన పెరుగుతో కూడిన కార్డ్ రైస్ తిన్న విద్యార్థులంతా అస్వస్థతకు గురైనట్లు వైద్యులు ధృవీకరిస్తున్నారు. శనివారం రాత్రి మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు సుమారు 65 మందికి పైగా కడుపునొప్పి వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు విషయం. ఉదయం కొంతమంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన అనంతరం తిరిగి గురుకుల పాటశాలకు పంపారు. మరి కొంతమంది విద్యార్థులు ఉదయం కూడా తీవ్ర కడుపు నొప్పి విరేచనాలతో బాధపడుతూ మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిని కూడా అంబులెన్స్ సాయంతో జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం అప్రమత్తమై గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. విషయం తెలుసుకున్న ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇతర బృందం పాఠశాలలో పరిసరాల భోజనానికి వినియోగించే కూరగాయలు ఇతర సామాగ్రిని పరిశీలించారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ప్రభుత్వ విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా కనిపించారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా విద్యార్థులను పరామర్శించేందుకు వస్తున్నట్లు తెలిపారు.