ఎంపి అరుణ ఎఫ్సిఐ చైర్ పర్సన్ గా నియామకం హర్షణీయం
సామాజిక నాయకులు జహంగీర్ పాషా
జడ్చర్ల రూరల్, మే 25 (మనఊరు ప్రతినిధి): భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ)కు చెందిన కన్సల్టేటివ్ కమిటీకి తెలంగాణ చైర్ పర్సన్ గా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను కేంద్ర ప్రభుత్వం నియమించడాన్ని స్వాగతిస్తూ ఆదివారం ఆల్ ఇండియా దళిత పాస్మాంద ముస్లిం ఓబిసి వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఫకీర్ జహంగీర్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు ఫకీర్ కుర్షిద్, హుస్సేన్, మహబూబ్ లు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జహంగీర్ పాషా మాట్లాడుతూ ఎంపీ డీకే అరుణ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఎఫ్.సి.ఐ కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్ పర్సన్ గా నియమించడం అభినందనీయమన్నారు. అరుణమ్మ ఇలాంటి మరిన్ని ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు.