మార్కెట్ కమిటీ యాడ్ లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి
జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి
ఆమనగల్, మే 26 (మనఊరు ప్రతినిధి): అకాల వర్షాలతో తడిసిపోయిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. సోమవారం ఆమనగల్ మార్కెట్ కమిటీ యాడ్ లో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యంతో రైతుల ధాన్యాలను కొనుగోలు చేయకుండా దాన్యం మొలకెత్తడం జరిగింది. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను డిమాండ్ చేయడం జరిగింది. మార్కెట్లో దాదాపుగా నెల రోజుల నుండి దాన్యాలను కొనకుండా నిర్లక్ష్య ధోరణితో రైతులపై పక్షపాతం చూపడంతో స్థానిక మార్కెట్ యార్డ్ ఆమనగల్లు స్థానిక రైతుల ధాన్యాలు కొనుగోలు చేయకుండా ఇతర గ్రామ పంచాయతీ ధాన్యాలను కొనుగోలు చేయడంతో రైతుల మహా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గొన్నారు.