ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకి జన్మనిచ్చిన కలెక్టర్ సతీమణి

 ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకి జన్మనిచ్చిన కలెక్టర్ సతీమణి






కొత్తగూడెం, మే 28 (మనఊరు ప్రతినిధి): పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ సతీమణి  ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం మగ బిడ్డకి జన్మనిచ్చింది. కాన్పులో ఆమె మగ బిడ్డకి జన్మనిచ్చారు. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. గత కొన్ని నెలలుగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకున్నట్లు వైద్యులు తెలిపారు. కలెక్టర్ సతీమణి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించుకోవడంతో సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల పై, ప్రభుత్వ వైద్యంపై నమ్మకం ఏర్పడుతుంది చర్చిస్తున్నారు.
కలెక్టర్ స్థాయిలో ఉండి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో తన సతీమణికి కాన్పు చేయడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ని ప్రశంసిస్తున్నారు. ప్రజలందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. 
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ ఎప్పుడు ప్రజలతో మమేకమవుతూ వారి సమాఖ్యలు వింటూ జిల్లా ప్రజలకు మరింత చేరువయ్యారు కలెక్టర్, ప్రజా సమస్యలు వినటంలో వారి పరిష్కారానికి తనవంతుగా సమస్యల పరిష్కారానికి నిర్ణయం తీసుకోవడంలో జీతీష్ వి పటేల్ ముందున్నారు అనడం లో సందేహం లేదు.జిల్లా బాస్ గా ఎన్నాళ్ళు ఉంటాం ఎప్పుడు వెళ్ళిపోతారో తేలిక పోయిన వెంటనే తన పని తను చేసుకుంటే పోతూ ప్రజల మన్నలను పొందుతున్నరు జిల్లా బాస్, జిల్లా పర్యటనలో ఒక్కోసారి ప్రజలలో కలసిపోవడం మరియు ఉపాధి శ్రామికులతో కలిసి పనులు చేస్తూ వారి సమస్యలు వింటారు, రైతులు భూ సమాఖ్యలు ఉంటే నేరుగా పొలాల్లోకి వెళ్లి రైతులతో నేరుగా మాట్లాడుతూ, రైతుల డిమాండ్లను వింటారు మరియు అధికారులతో మాట్లాడి సాధ్యం అయినంతవరకు పరిష్కార మార్గం చూపుతారు.గిరిజనులతో ఆడుతు పాడుతూ నృత్యాలు చేస్తారు. ఒక్కోసారి కలెక్టర్ తీసుకునే నిర్ణయాలు మరియు వ్యక్తుల ఆలోచన ఒకింత ఆశ్చర్యానికి దారితీసే విధంగా ఉంటాయి, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం పై నమ్మకం ప్రసవాలు పెరగడం కోసం కలెక్టర్ తన సతీమణి మరియు గర్భిణి ఐనా శ్రేద్దా జీతీష్ వి పాటిల్ ను పాల్వంచ ప్రభుత్వం ఆసుపత్రిలో చేర్చి ఆదర్శపరాయుడు గా నిలిచారు. పరీక్షా హాస్పిటల్స్ వైద్యం చేయించి స్తోమత, అవకాశం కూడా జాయిన్ చేయించుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయించి, ప్రసవం జరిపించి ఆదర్శప్రాయుడిగా నిలిచారు కలెక్టర్ సాబ్. కలెక్టర్ తీసుకున్న నిర్ణయం పట్ల జిల్లా వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది.అదేవిదంగా సంప్రదాయాలను,సంస్కృతిని కాపాడడంలో ముందున్నారు జిల్లా కలెక్టర్ జీతీష్ వి పటేల్.నిత్యం ప్రజా సమస్యల పోరాటానికి నిలువెత్తు రూపం జిల్లా కలెక్టర్ జీతీష్ వి పాటిల్ అనడం లో సందేహం లేదు.





Previous Post Next Post