బ్యాంకు ఖాతాల్లో రైతులకు నిధులు జమ.. చెక్ చేసుకున్నారా..!
హైదరాబాద్, మే 29 (మనఊరు ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి శుభవార్త చెప్పింది. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఆసరాగా నిలిచింది. రైతులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. పంట నష్ట పరిహారం నిధులను బుధవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల వడగంట్ల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో 5,528 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అంచనా నివేదిక ప్రచారం ప్రభుత్వం రూ. 51.52 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయడానికి సంబంధిత అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీసుకున్నారు. మే నెలకు పంట నష్టపరిహారం నిధులు త్వరలోనే విడుదలయ్యాయి అని మంత్రి తుమ్మల తెలిపారు.