*శనేశ్వర స్వామికి శాస్త్రోక్తంగా తిల,తైలా అభిషేక పూజలు....*
**పరమశివునికి రుద్రాబిషేకలు,అర్చనపూజలు*
*వడ్డేమాన్ లో శనేశ్వర స్వామికి వైభవంగా శని త్రయోదశి ప్రత్యేక పూజలు*
బిజినెపల్లి, మే 10 (మనఊరు ప్రతినిధి): శని త్రయోదశి పురస్కరించుకొని శనేశ్వర స్వామికి భక్తులచే భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా వేడుకలు వైభవంగా జరిగాయి. బిజినెపల్లి మండల పరిధిలోని నంది వడ్డేమాన్ గ్రామంలో శ్రీ విశ్వవాసు సంవత్సరం వైశాఖ మాసం శుక్ల శని త్రయోదశి శనివారం నాడు శ్రీసార్థాసప్త జేష్టమాత సమేత శనేశ్వర స్వామికి ప్రత్యేకంగా తిల తైల అభిషేకాల పూజలు నిర్వహించారు. అలయ ప్రధానఅర్చకులు డాక్టర్ గవ్వమఠంవిశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ భక్తులు ప్రతి మాసంలో శనివారం నాడు అష్టమి, నవమి, త్రయోదశి చతుర్దశి,అమావాస్య తిథులు ఉన్న రోజు శనేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజించి అభిషేకించిన విశేష పుణ్యఫలతం దక్కుతుందని అన్నారు.ఈ మాసం శనేశ్వర స్వామిని పూజించిన ఆరాధించిన విశేష పలితం ఉంటున్నది అన్నారు. మీన రాశి నుండి మేష రాశి వరకు గల వారికి జన్మరీత్యా గోచార రీత్యా ఉన్న సంచారంలో శని గ్రహదోష పరిహార నిమిత్తం శనీశ్వర స్వామికి శక్తి కొలది తిలతైల అభిషేక పూజలు,అష్టోత్తర పూజలు,స్వామివారిని దర్శించుకోవడం, ఆరాధించడం,నామం జపించడం విశేష ఫలితం ఉంటుందని అన్నారు. అనంతరం గోన బుద్ధారెడ్డి కాలంనాటి బ్రహ్మ సూత్రం గల పరమశివునికి ఈరోజు భక్తులచే సామూహిక రుద్రాభిషేకపూజలు,అర్చనలు ప్రత్యేకంగా నిర్వహించినట్లు తెలిపారుభక్తులు జమ్మి చెట్టుకు19 ప్రదక్షణలు వేదమంత్రచరణల మధ్య చేశారు.గణపతి,నందీశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనిత్రయోదశి ఉన్నందున వడ్డేమాన్ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు భక్తులకు ఏర్పాటు చేశారు. స్వామివారిని దర్శించిన భక్తులందరికీ అల్పాహారంతోపాటు అన్నప్రసాద వితరణ చేశారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ఆలయ కమిటీ సభ్యులు కేంచే రాజేష్ ప్రభాకర్, పుల్లయ్య, వీర శేఖర్, శ్రీకాంత్ రెడ్డి, ఆలయ ఆర్చకులు గవ్వమఠం శాంతి కుమార్, ఉమమహేశ్వర్, సిబ్బంది గోపాల్ రెడ్డి భక్తులు, మహిళలు,అధిక సంఖ్యలో పాల్గొన్నారు.