ఇందిరమ్మ రాజ్యంలో తీరిన సొంత ఇంటి కల
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి
*రాణిపేట గ్రామంలో ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన*
మిడ్జిల్, మే 28 (మనఊరు ప్రతినిధి): ఇందిరమ్మ రాజ్యం వచ్చాక గ్రామాల్లో పేదల సొంత ఇంటి కలలు నెరవేరుతున్నాయని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతిఅల్వాల్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని రాణిపేట్ గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ గృహాలకు ఆమె హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ప్రోసిడింగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదల కలలు సాకారం అవుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కృషితో మొదటి విడతలు అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశామని ఇంకా అనేక విడతల ద్వారా ఇండ్లు లేని పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని వారు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇల్లు మంజురుచేస్తామని అన్నారు. వచ్చిన వారు అందరూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. మీరు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది అని అన్నారు.
బడుగు బలహీనర్గాల అభివృద్దే ద్యేయంగా మన ప్రియతమ నాయకుడు సిఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, నాయకులు అల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య, మాజీ ఎంపిటిసి గౌస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యం గౌడ్, జిల్లా నాయకులు సాయిలు, రాణి పే గ్రామ కమిటీ అధ్యక్షులు కర్నెకోట మల్లేష్, గ్రామ కార్యథర్శి సుదర్శన్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.