సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

 సందడిగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

మణుగూరు, మే 28 (మనఊరు ప్రతినిధి): మండలంలోని సాంబయ్యగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 పదవ తరగతి బ్యాచ్ (స్కూల్ మొట్టమొదటి పదవ తరగతి బ్యాచ్) విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం సందడిగా జరిగింది. పదవ తరగతి చదివిన విద్యార్థినీ విద్యార్థులు తమ యొక్క పాత తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. గురువుల యొక్క పాత్ర జీవితంలో ఎంతో ఉంటుందని గురుదక్షిణగా వారిని ఈ సందర్భంగా గౌరవించుకోవడం తమ అదృష్టమని అనుకున్నారు. అంతకుముందు డాక్టర్ షేక్ మీరా హుస్సేన్, ఎన్ సత్యనారాయణ , ఎస్ శ్రీను, ఆర్ శ్రీను షేక్ షాబుద్దీన్, శుద్ధపల్లి చెన్నారెడ్డి గురువులు డాక్టర్ షేక్ మీరా హుస్సేన్, ఎన్ సత్యనారాయణ , ఎస్ శ్రీను, ఆర్ శ్రీను షేక్ షాబుద్దీన్, శుద్ధపల్లి చెన్నారెడ్డి గురువులను ఘనంగా పూలమాలలతో శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కే దీపక్, ఎండి శంషుద్దీన్ డి వీరభద్రం పులిగిల్ల అశోక్ , కే నరేష్ పి నవీన్, బి సంజీవ, పి సాయిబాబు జయ సాయిబాబు సచ్చ గిరి వరప్రసాద్ ఎస్కే ఖలీల్ ఎస్కే రఫీ కృష్ణకుమారి సరిత ఏ సతీష్, జి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post