వ్యవస్థాపక అధ్యక్షురాలు: శ్రీమతి సత్యవీణ మొండ్రేటి
నేడు విద్య వ్యాపారంగా తయారయింది... కేజీ నుండి పీజీ వరకు చదువును కొనడమే... పుట్టిన నాటినండి బిడ్డ భవిష్యత్తు కోసం సంపాదించడం తప్పనిసరి అయింది... మధ్య తరగతి కుటుంబాలలో చదువే జీవన భృతిని కల్పిస్తుంది... అష్ట కష్టాలు పడి పిల్లల్ని చదివిస్తారు... వాళ్లు పెరిగి పెద్దయి చదువు కోసం సంపాదన కోసం విదేశాలకు వలస పోతున్నారు.... స్వదేశంలో విలువైన విద్య లేదంటారా.... నిరుద్యోగం కూడా ఒక కారణం మన దేశంలో.... అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో
ప్రాథమిక విద్య ఉచితంగా అందివ్వబడుతుంది... ఒక్క రూపాయి పీజ్ కూడా లేదు అక్కడ.... రవాణా సౌకర్యం
ఆహార భద్రత కూడా ప్రభుత్వమే భరిస్తుంది...
అధిక జనాభా ఉన్న మన దేశంలో కొంచెం కష్టమే కావచ్చును కానీ ప్రభుత్వం తలచుకుంటే ఉచిత విద్య కనీసం ప్రాథమిక పరిధిలోనైనా అందివ్వవచ్చును... ప్రజా పరిరక్షణ ప్రభుత్వ కర్తవ్యం...
ఎన్నో రోజులుగా ఉచిత విద్య ఉచిత వైద్యం అందివ్వాలని ప్రజా సంస్థలు చెప్తున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం లేదు....
ఇప్పటికైనా ప్రైవేట్ విద్యాసంస్థలపై ఫీజు విషయంలో కట్టడి చేయాలి
అందరికీ అందుబాటులో ఫీజులు ఉండాలి... వార్షిక ఆదాయాన్ని బట్టి ఫీజులో రాయితీలు ఇవ్వాలి... దేశంలో ప్రతి ఒక్కరికి విద్య అందాలి...
అంటే ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రైవేటు సంస్థల దోపిడీని అరికట్టాలి....
నా స్వీయ రచన
____________________
సాహితీ వీణా కుసుమాలు
పేరు వి విజయ శ్రీ దుర్గ
ఊరు విజయవాడ
అంశం సమస్య పరిష్కార వేదిక శీర్షిక
విద్యను వాణిజ్యం కాకుండా – వేదంలా పవిత్రంగా భావించండి "
ఈనాడు పిల్లల్ని స్కూళ్ళలో చేర్చాలన్నా, కాలేజీలో చేరాలన్నా విరాళాలు పెద్ద సమస్యగా మారింది. విద్య మార్గదర్శిని, మానవునికి ఒక శక్తిమంతమైన ఆయుధం. కానీ ఆ మార్గంలో అడుగిడించాలంటే తల్లిదండ్రులకు ఎదురయ్యే ప్రధాన అడ్డంకి విరాళాల పేరిట వసూలు చేసే అదనపు పెనుబారం చిన్నారుల తల్లిదండ్రులకు బహు ఒత్తిడి గురిచేస్తోంది ..
విద్యను వ్యాపారంగా మారుస్తున్న ఈ విరాళ సంస్కృతి సామాన్యుల ఆశలపై నీళ్లు జల్లుతోంది. ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యాసంస్థల్ని ఆశ్రయించలేక, సాధారణ స్థాయికి పరిమితమవుతున్నారు. అభ్యాసంపై ఆసక్తి, నైపుణ్యం ఉన్నా — డబ్బు లేని కారణంతో వెనుకబడి పోతున్నారు.
విద్యాలయాల్లో ఇప్పటికే ఫీజులువిధించబడుతున్నాయి. వాటితోపాటు మళ్ళీ “విరాళం” పేరిట డబ్బులు వసూలు చేయడం అన్యాయమే కాదు, అక్రమమే. ఇది విద్యారంగం పట్ల ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం వలే.
విరాళం అనేది స్వచ్ఛందమైనది కావాలి, షరతులతో కూడినది కాకూడదు.విద్య ఓ హక్కు, వ్యాపార సాధనం కాదు. మానవ అభివృద్ధికి మూలాధారం. విద్య సంస్థలు ఆ అంశాన్ని గుర్తించాలి. ప్రభుత్వ నియంత్రణ గట్టిగా ఉంచుతూ విరాళాల పేరిట విద్యార్థులపై ఆర్థిక భారం మోపే చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలి.సమాజం శక్తివంతంగా మారాలంటే విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. సామర్థ్యం ఉన్నవారు ఎంత ఖర్చైనా భరిస్తారు. కానీ సామాన్యుడి మూడురోజుల జీతం కూడా పిల్లల చొప్పున “విరాళం” పేరిట పోతుంటే, వాళ్ల ఆశలు, కలలు నేలరాలుతాయి.
విద్యార్థుల ప్రతిభను అడ్డుకునే కాదు — అభివృద్ధి చెందేలా ప్రోత్సహించాల్సిన అవసరం మనందరిపై ఉంది.విద్యను వాణిజ్యం కాకుండా – వేదం లాంటి పవిత్రంగా చూద్దాం!"
_____________________
సాహితీ వీణా కుసుమాలు
16.5.25
అంశం: సమస్య పరిష్కారం
రచన: యశోద గొట్టిపర్థి
శీర్షిక: విద్యా వ్యాపారం
*************
పిల్లల్ని స్కూళ్ళలో చేర్చాలన్న, కాలేజీలో చేర్చాలన్న విరాళాలు తప్పనిసరి.
కార్పొరేట్ స్కూల్ చదువు అంటేనే చాలా ఖర్చు అయినకూడవెనుకాడటం లేదు. ప్రతిఒక్కరికీ విద్య అవసరం.. కాబట్టి కాస్త విద్య ప్రమాణాలు అధికంగా ఉన్న పాఠశాలను మాంటి సోరి నుండి ఉన్నత విద్యల వరకు ప్రైవేట్ పాఠశాలలను, కళాశాలలను ఎన్నుకుంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు.
డొనేషన్స్ ఉన్నా తప్పనిసరి అయి , ఫీజులు పెంచినా వేరే అవకాశం లేక, ప్రభుత్వ పాఠశాలలు ,కళాశాలలు అందు బాటులో లేక, ఉద్యోగ వృత్తులు పట్టణాలలో , ప్రభుత్వ పాఠశాలల కొరత, అక్కడ బోధనా పద్ధతులు నచ్చక, క్రమశిక్షణా రాహిత్యం , విద్యార్థులకు తరగతి గదులుండక ఇలాంటి అస్తవ్యస్త ము లను భరించలేక ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు పిల్లలను.
ప్రభుత్వం చొరవ తీసుకుని ,విరాళాలను అరికట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో. నాణ్యతవిద్య తో పాటు , కార్పొరేట్ స్కూళ్లపైన దృష్టి
పెట్టీ , బీద , పేద , మధ్య తరగతి వారికందరికీ సమానవిద్యా వకాశాలు కల్పించాలి.
పాశ్చాత్య దేశాలకు పంపించడం కోసం త్త ఆస్తులను తాకట్టు పెట్టి అయిన విరాళాలు ఇచ్చి పాఠశాలలో, లాశాలల్లో. సీటు సంపాదించుకున్న తరువాత భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం చోటు చేసుకుంది తల్లి తండ్రులకు.
మార్కులు తక్కువచ్చి పై చదువుకు అర్హత లేక పోయినా, విరాళం ఇచ్చి స్థానం సంపాదించు కుంటూన్నారు.
డబ్బుతోటి అందలం ఎక్కుతున్నారు.
వ్రేళ్ళ మొదట్లోనే సేంద్రియ ఎరువుకన్నా, రసాయనిక ఎరువే బలం అని పెంచినట్లు , తర్వాత వచ్చే అనర్థాలు ఆలోచించట్లేదు.
ఆస్తులు తరిగి, పిల్లలకు సంస్కార విద్య కరువై అస్త వ్యస్థమే కాబట్టి విరాళం బదులు వివేకం పెట్టాలి ప్రతిఒక్కరూ!
(హామీ: నా స్వీయ రచన)
_____________________
సాహితీ వీణా కుసుమాలు
16 మే, 2025 శుక్రవారం
అంశం : సమస్య పరిష్కార వేదిక
శీర్షిక. : ఓటు - విరాళం
V T రాజగోపాలన్
మైసూరు
విద్యా *దానం* ఎప్పుడో పోయే
విద్యా *ధనం* నడుస్తున్నదాయే
బాబో, పాపో పుడతారంటే వాళ్ల
సదువులకోసం బారులు తీరటం
అలవాటయ్యి ఏండ్లవుతున్నాయి
ధనవంతులకు ఓ లెక్క కాదు
మధ్య తరగతికన్నీ లెక్కలే
రెక్కలు ముక్కల కష్టార్జితం
బడి ఫీజులకే సరిపోవడంలే
ఇంకా విరాళాలు అంటే ఎక్కడికెళతాం
మేమున్నామంటూ వడ్డీ వ్యాపారులు
పెద్ద చదువులకు బ్యాంకులు ముందు
అప్పుల బారి పడుతున్న ప్రజానీకులు
నిజం చెప్పాలంటే విద్యా సంస్థలు
చాలా భాగం మనం ఎన్నుకున్న
నాయకులదే అన్నది నిజం నిజం
చూపుడు వేలిన కాటుకకు
చేతులు చాపి తీసుకున్నాం
అన్ని వేళ్ళకు కలిపి వారు
వేలల్లో కాదు లక్షల్లో ఇస్తున్నాం
మేలుకొలుపు మనలోనే మొదలవ్వాలి
ఎన్నుకున్న ప్రభుత్వాలు మనకండగా నిలవాలి
ఉచితాలివ్వడం ఆపాలి, ఉన్నత విద్యకు
సాయం అందించాలి, పిల్లలు బాగా చదవాలి
కన్న వాళ్ల కష్టాలు గుర్తించాలి
నాయకులారా మీకోసం
ఓటు కోసం నోటు వద్దు
మా చదువులకు అడ్డు పడవద్దు
విరాళాలు అడగడం ఆపండి
విద్యా దానానికి తోడ్పడండి..
___________________
💐 సాహితీ వీణా కుసుమాలు
తేది 16-5-2025శుక్రవారము.
విభాగము.సమస్యాపరిష్కారము.
అంశము.పిల్లల్నిస్కూళ్ళల్లో
చేరాలన్న, కాలేజీలో చేరాలన్న విరాళాలు ఇవ్వడం చర్చించండి.
శీర్షిక.. పేద పిల్లలు విరాళాలు ఇవ్వలేరు.ధనికులు ఇస్తారు.
పేరు.యం.అరవింద.వరంగల్.
*************************
పూర్వమువిద్య అందరికి అందుబాటులోవుండేది.వెనుక
బడినవిద్యార్థులకు, ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారు.
అప్పుడు.ప్రభుత్వపాఠశాలలు
వుండేవి. ఇప్పుడు ప్రవేటుపాఠశాలలుపెట్టి
విరాళాలు అడుగుతున్నారు.
ధనవంతులు ఇస్తారు
ఎంతడబ్బైనా? పేదలు ఇవ్వలేరు వారిని చిన్నచూపు చూస్తున్నారు.
ఇదిచాలాఅన్యాయం.
డబ్బున్న వారు, విద్యనుకొంటున్నారు.
తర్వాత ఉద్యోగం దొరికేందుకు
చాలాకష్టం.
పేదవారు కష్టపడిచదివి పైహోదాలోవుంటుంన్నారు.
అలాకాకుండా వారికి స్కాలర్షిప్ మంజూరిచేయించి
వారిని ఉచితంగా చదివించాలి.
ప్రభుత్వంవారుకూడ సహాయంచేయాలి .వారిని బాగుచేసినవారై
తారని నాఅభిప్రాయం.
విద్యాసంస్థలు విద్యార్థుల
భావితరాలకుబంగారుబాట
వేద్దాము.
ధనికులైన పేదలైన అందరు
విద్యావంతులు కావాలి.
నాస్వీయరచన.
ధన్యవాదములు 🙏
_______________________
*సాహితీ వీణా కుసుమాలు.*
*తేది:16/05/2025*
*పేరు: నాగమణి రావులపాటి.*
*ఊరు: వరంగల్.*
*అంశం: పిల్లల్ని స్కూళ్ళలో కాలేజీలో చేర్చాలన్నా విరాళాలు ఒక సమస్యగా మారింది...*
*శీర్షిక: సరళమైన ఫీజులతో ఆనందం కలగజేయండి.*
********************************
*నాటి కాలంలో చదువులు ఒక విలువైన సంపద...*
*హంగులు ఆర్భాటాల కన్నా చదువుకే ఎక్కువ విలువ ఉండేది...*
*అలాగే వారి చదువుకు తగ్గ ఉపాధి వారికి లభించేది...*
*అలాగే ఎవరి వృత్తులకు వారు విలువను కల్పించుకుని జీవనం సాగించేవారు...*
*కానీ ఈరోజుల్లో చదువే అన్నింటికీ ఆధారం తల్లితండ్రులు వారి భవిష్యత్తుకై శ్రమంతా ధారపోస్తున్నారు...*
*ఇంటిలో గ్రాసానికన్నా ఈ చదువులపై విరాళాలు ఫీజులు కళ్ళనీళ్ళు తెప్పిస్తున్నాయి...*
*చదివించటం ఒక వైపైతే పోటీతత్వం మరోవైపు ...*
*దానితో ఉత్తమ పాఠశాల ఎంపిక సామాన్యులకు తలకు మించిన భారమే...*
*దీనిని ఆసరా చేసుకుని స్కూల్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటున్నారని చెప్పక తప్పదు...*
*విద్య ఒక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది...*
*భారతదేశ ప్రగతికై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొనక తప్పదు...*
*నేటి బాలలే రేపటి పౌరులని తెలిసి కూడా వారిని నిర్లక్ష్యం చేయటం శోచనీయం...*
*విధిగా ఫీజులు మరియు విరాళాలు విషయంలో తగిన విధానం ప్రవేశపెట్టాలి...*
*అప్పుడే అందరూ విద్యావంతులు అవటం సాధ్యపడుతుంది...*
*విద్యార్దులారా చక్కని అవగాహనతో చదువుపై శ్రద్ధ పెట్టి దేశ అభివృద్ధికి తోడ్పడండి...*
*కన్నవారి రుణం జన్మభూమి రుణం తీర్చగా మంచి పౌరులుగా ఎదగండి...*
*పాఠశాల యాజమాన్య మహోదయులారా పిల్లలకు మూలాధారం చదువే కదా ...*
*దయచేసి వారికి వారి తల్లితండ్రులకు ఆనందాన్ని కలగజేస్తూ సరళమైన ఫీజులను ప్రవేశపెట్టండి...*
*హామీ పత్రం ఇది నా స్వీయ రచన...*
_____________________
సాహితీ వీణా కుసుమాలు - 16.05.2025
అంశం : పిల్లల్ని స్కూళ్ళలో కాలేజీలో చేర్చాలన్నా విరాళాలు ఒక సమస్యగా మారింది (సమస్య..పరిష్కార వేదిక)
జె వి కుమార్ చేపూరి
హైదరాబాద్
రచన సంఖ్య : 132
శీర్షిక : సర్కారు లోపం
అక్షరాన్ని అమ్ముకోడం మహాపాపం
అంటున్నది వేద విహిత ధర్మం
గురుకులాల్లో బోధించినా సకల శాస్త్రం
గురువులు ఆశించలేదేనాడూ ప్రతిఫలం
కడకు శిష్యులు చెల్లించే బహుమానం
అది గురువుల మీదున్న గౌరవ భావం
నేటి కార్పొరేటు విద్యకెక్కడిదంతటి నీతి న్యాయం
దండుకోవడమే వాటి ప్రధాన ధ్యేయం
చెప్పే విద్యకు పదింతలు మూల్యం
చెల్లించక తప్పని వ్యవహారం
ప్రభుత్వ బళ్ళలో అరకొర సౌలభ్యం
పంతుళ్ళ లేమొక పెద్ద అసౌకర్యం
పంతుళ్ళలో చిత్తశుద్ధి లోపం
వెరసి సర్కారు బడొక శాపం
తడిసి మోపెడున్నా, ఫీజుల భారం
అప్పు చేసైనా, మధ్యతరగతి సైతం
కార్పొరేటు విద్యకే ఇస్తున్నది ప్రాధాన్యం
ప్రభుత్వ లోపాలను సొమ్ము చేసుకుంటున్నది
కార్పొరేటు విద్యారంగం
చిత్తశుద్ధితో పూనుకొని ప్రభుత్వం
ఫీజుల వసూళ్లపై మోపాలి ఉక్కు పాదం
లేదంటే సర్కారు విద్యాలయాలను
కార్పొరేటు విద్యాలయాలకు దీటుగా
తీర్చిదిద్దాలి సత్వరం
అపుడే, పేద, గొప్ప లేక వ్యత్యాసం
ఉత్తమ విద్య అందరికీ లభ్యం
==== * ==== * ====
హామీ : ఈ కవనం నా మదిలో మెదిలిన ఊహల రూప కల్పన, స్వీయ పద కూర్పుల భావజాలన. దీనిపై సర్వ హక్కులు నావే.