*విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలను సాధించాలి*
_*ఎ యం ఓ దుంకుడు శ్రీనివాస్*
*_ విజయ వంతంగా ముగిసిన వృత్యoతర శిక్షణ*
మహబూబ్ నగర్, మే 24 (మనఊరు ప్రతినిధి): విద్యార్థుల్లో కనీస అభ్యాసన సామర్థ్యాలను సాధించాలని ఎ యం ఓ దుంకుడు శ్రీనివాస్ అన్నారు. మహబూబ్ నగర్ లోని గత రోజులుగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దేవరకద్ర మండల స్థాయి ప్రాథమిక ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న వృత్యంతర శిక్షణ శనివారం విజయ వంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ శిక్షణ కేంద్రాన్ని ఏ యం ఓ దుంకుడు శ్రీనివాస్ సందర్శించి ఉపాధ్యాయులనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి లో విద్యా ప్రమాణాలు పెంచాల్సి న బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని అన్నారు. విద్యార్థుల కోసం మెరుగైన బోధన పద్ధతులు , విద్యార్థుల వ్యక్తి గత అవసరాలకు అనుగుణంగా బోధన, విద్యార్థుల సామర్థ్యాలను ఎలా పెంచాలనే అంశాలపై ఇచ్చిన శిక్షణను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని కోరారు. మండల విద్యాధికారి, కోర్స్ డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలకు ఉపాధ్యాయులే కీలకమని అన్నారు. ప్రాథమిక దశలోనే విద్యార్థుల పట్ల శ్రద్ధ కనబరచి వారికి చదవడం రాయడం నేర్పించాలని కోరారు.దీనికి ఆనుగుణంగా పాఠ్యాంశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని తద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. కనీస అభ్యాసన సామార్థ్యల సాధనయే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. డిఆర్పీ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల స్థాయికనుగుణంగా విద్యా బోధన చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ పి లు సూర్మి రాఘవేందర్, రమేష్,శంకర్, పవన్,శ్రీనివాస్ రెడ్డి, యం.రాఘవేందర్, నాగరాజు, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.