భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి

 భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతుంది

భజనలు చేసే ప్రతిగ్రామం స్వర్గదామమే 

 ఘన చరిత్రగల ఎలికట్ట గ్రామాన్ని సందర్శించడం నా పూర్వజన్మ సుకృతం 

____ హైదరాబాద్ సిఎస్ కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ అంజనికుమారి

ఎలికట్ట భజన భక్తులకు భరతమాత ఎక్సలెంట్ అవార్డులు ప్రధానం 












కల్వకుర్తి, మే 20 (మనఊరు ప్రతినిధి): భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతుందని హైదరాబాద్ సిఎస్‌ కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ పివిపి అంజలికుమారి అన్నారు. సోమవారం రాత్రి మన సేవా సమితి ఆధ్వర్యంలో కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామంలో నాలుగు రోజులపాటు నిర్వహించి తలపెట్టిన ఆమె భజన కారణంగా. ఈ సందర్భంగా గ్రామంలోని భజన భక్తులకు శాలువాలు కప్పి,మెమోంటోలు అందజేసి భరతమాత ఎక్సలెంట్ అవార్డులను ఆమె ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భగవన్నామావళిని లయబద్ధంగా పలుకుతూ సామూహికంగా శృతి కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేల ఉంటుంది. పదిమందితో కలిసి భగవంతుడిని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుందని అన్నారు.అంటేకాక అలసటను మరచిపోయి భజన భక్తులందరూ నూతన ఉత్తేజం పొందండి ఉత్సాహవంతులు అవుతారని ఆమె తెలిపారు. పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా భజన భక్తులు మానసికానందంలో మునిగి తేలుతారు. భజనవల్ల హృదయ స్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుందని అన్నారు. అలాగే మెదడు చురుగ్గా పనిచేస్తుందని ఆమె చెప్పింది. క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, బీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. మనం చెట్టు కింద నిలబడి చప్పట్లు కొట్టగానే చెట్టు పైనున్న పక్షులన్నీ ఎలాగైతే ఎగిరిపోతాయో. వల్ల మనిషిలో ఉన్న భౌతిక విషయాల మీద వ్యామోహాలు ఎగిరిపోతాయని అన్నారు.భజనలు చేసే ప్రతి గ్రామం స్వర్గదామమేనని, ఎలాంటి భజన భక్తులను మెండుగా కలిగిన ఏలికట్ట గ్రామం కూడా ఆ కోవలోకే వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.ఎలికట్ట గ్రామానికి ఎంతో ఘనచరిత్ర ఉన్నదని,ఈ గ్రామంలో జన్మించిన చిత్తరంజన్ దాస్ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావును ఓడించడం విశేషమని,

అలాంటి పుట్టిన పురిటి గడ్డకు తాను రావడం,గ్రామంలోని భజన భక్తులను సన్మానించడం తన పూర్వజన్మ సుకృతమని ఆమె మిక్కిలి సంతోషం వ్యక్తం చేశారు. 

 ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పట్టణానికి చెందిన ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మికవేత్త నారాయణస్వామి,జడ్చర్ల పట్టణ ప్రముఖుడు హైకోర్టు న్యాయవాది బాదిమి రవిశంకర్, ప్రముఖ సామాజికవేత్త కర్నెకోట యాదిలాల్ జి, మన సేవా సమితి అధ్యక్షులు వి.వేణుగోపాల్ చారి, సభ్యులు రవీందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సందీప్, నాగిరెడ్డి, భజన భక్తులు,గ్రామ ప్రజలు ఉన్నారు.

Previous Post Next Post