పల్లె పల్లెలో బీసీసేన గ్రామ కమిటీలు

 *పల్లె పల్లెలో బీసీసేన గ్రామ కమిటీలు*

*మహిళలకు తోడుగా నేను సైతం అని కదిలి వచ్చిన ఫరూక్ నగర్ మండల అధ్యక్షురాలు జక్కుల జలజ*

*కార్యక్రమానికి విచ్చేసిన జిల్లెడు చౌదరిగూడ మండల అధ్యక్షురాలు ప్యాట జయశ్రీకాంత్* 

షాద్ నగర్, జూన్ 1 (మనఊరు ప్రతినిధి): ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో మహిళ అధ్యక్షురాలు జక్కుల జలజ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు అందరూ చైతన్యవంతులు కావాలని బిసి మహిళలు ఏకతాటిపై రావాలని బీసీల అందరం కూడా ఐక్యతగా ఉండి ముందుకు సాగాలని తెలియజేశారు. ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసి జిల్లెడు చౌదరిగూడ మండల అధ్యక్షురాలు జయశ్రీకాంత్ మాట్లాడుతూ మహిళల్లో చైతన్యం గురించి మరియు గ్రామ అభివృద్ధి గురించి కూడా తెలియజేస్తూ సరైన న్యాయం జరగాలి మహిళలందరూ ఏకమై మన హక్కుల కోసం నేను సైతం ఊరున నా తరహాగా బీసీలకు సేవ చేస్తున్నాను మనందరం కూడా కలిసి బీసీ సేనను పైకి తీసుకురావాలని అందరం ఒకేదాటిపై నడవాలని తన మాటలతో తెలియజేశారు. గ్రామ కమిటీ అధ్యక్షురాలుగా చాకలి శివ జ్యోతి, ఉపాధ్యక్షురాలుగా జి .చిలకమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఆర్. లక్ష్మి, కార్యదర్శిగా ఎల్. శివ లీల, సహాయక కార్యదర్శిగా కె. వనమాల లను గ్రామ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.

Previous Post Next Post