పంట మార్పిడితో అధిక దిగుబడులు

 పంట మార్పిడితో అధిక దిగుబడులు

అవసరం మేరకే రసాయన ఎరువులు

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిదాలయం ప్రొఫసర్ త్రివేణి



కల్వకుర్తి, మే 22 (మనఊరు ప్రతినిధి): పంటల మార్పిడితో అధిక దిగుబడులు సాధించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిదాలయం ప్రొఫసర్ ఎస్, త్రివేణి తెలిపారు. గురువారం మండలంలోని వెంకటాపూర్ లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిదాలయం, వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతు అవగాహన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడుతూ రైతులు అధిక దిగుబడి కోసం ఎక్కువ మోతాదులో యూరియా, రసాయన ఎరువుల ను వినియోగిస్తున్నారన్నారు. అవసరం మేరకే వాటిని వాడాలన్నారు. దీంతో పెట్టుబడి ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. సస్యరక్షణ చర్యలతో తెగుళ్లను నివారించవచ్చని సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, వ్యవసాయంలో యంత్రాల వినియోగంపై అవగాహన పెంచుకోవాలన్నారు. గ్రామాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని, సాగునీటిని పొదుపుగా వాడుకో వాలని సూచించారు. సహజ వనరులు, పంట మార్పిడి, చెట్ల పెంపకం, సాగునీటి యాజమాన్యం, విత్తనాలు, రసాయనాల కొనుగోలు చేసిన రసీదులను భద్రపరుచుకోవడం వల్లే చేకూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. రసాయన ఎరువుల మోతాదును తగ్గించి-సెంద్రియ ఎరువులు వాడినప్పులు 10-20·1. పంట పంటించే ఖర్చును తగ్గించుకోవచ్చని వివరించారు. అధునాతన వ్యవసాయంపై అవగాహన కల్పించి చైతన్యవంతుల చేయడం ద్వారా రైతులు పంటలో మంచి దిగుబడి సాదిస్తారన్నారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనల మేరకు రసాయనిక ఎరువులను, పురుగుల మందులను తగ్గించి పంట పండించడం రైతులకు ఎంతో లాభదాయకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. స్వరుపరాణి, ఎఈవో, రైతులు పాల్గొన్నారు.

Previous Post Next Post