*ఎమ్మెల్యే శంకర్ ను కలుసిన షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ*
షాద్ నగర్, మే 23 (మనఊరు ప్రతినిధి): అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసిపి) గా బదిలీపై ఇక్కడికి వచ్చిన ఎస్ లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా ఏసీబీ తన పరిచయాన్ని చేసుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాంతిభద్రతల పర్యవేక్షణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంతంలో ప్రజలకు ఎప్పుడు ఏ అవసరమైన పోలీసు శాఖ తరపున సత్వర సేవలు అందజేయాలని సూచించారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారిని ఆపద సమయంలో ఆదుకునే విధంగా సేవలు ఉండాలని ఏసీపికి సూచించారు.