మానవత్వం చాటిన ఆర్టిసి కండక్టర్
గద్వాల్, జూన్ 8 (మనఊరు ప్రతినిధి): ఆర్టిసి కండక్టర్ సూరిబాబు, డ్రైవర్ కె. పరశురాములు మానవత్వం చాటుకున్నారు. కర్నూలు నుంచి గద్వాలకు వచ్చి బస్సులో ఇద్దరు ప్రయానికులు గద్వాల్ డిపోకు చెందిన TS33Z 0013 బస్సులో వాళ్ళు బ్యాగ్ మరచిపోయి దిగిపోయారు. గమనించిన కండక్టర్ బ్యాగులో ఉన్న ఐడి కార్డ్ ను పరిశీలించి డిపో మేనేజర్ కు సమాచారం అందించారు. బ్యాగులో పోగొట్టుకున్న 25 తులలా బంగారం, ఒక ల్యాప్ టాప్, రూ.40వేల నగదుతో కూడిన బ్యాగును ప్రయాణికుడికి అందజేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. ఉదారత చాటుకున్న గద్వాల డిపోకు చెందిన కండక్టర్ సూరిబాబు, డ్రైవర్ కె. పరశురాములు తన వస్తువులు తిరిగి ఇవ్వడంతో ప్రయాణికుడు సైతం కండక్టర్, డ్రైవర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఆ కండక్టర్, డైరెక్టర్ లను డిపో మేనేజర్ జి.సునీత అభినందించారు.