ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

 ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

టాస్క్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్టాపన





కల్వకుర్తి, జూన్ 5 (మనఊరు ప్రతినిధి): ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ఒత్తిడికి గురవుతున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని టాస్క్, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. గురువారం జంగారెడ్డిపల్లిలో ఆంజనేయస్వామి విగ్రహప్రతిష్టాపన కోసం హాజరైన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఆధ్యాత్మికంలో నడవాలని అన్నారు. స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించి,స్వామి వారి ఆశీస్సులతో గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రూ 5,లక్షలు అభివృద్ధికి సహకరించిన ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా

ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మాట్లాడుతూ...తమ గ్రామంలో ఆంజనేయస్వామి గుడి నూతన నిర్మాణంలో బాగంగా సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని కలిసిన వెంటనే దేవాలయానికి తన వంతు సహకారంగా దాదాపు రూ.5 లక్షల (ఐదు లక్షలు)తో పెయింటింగ్ పనులు పూర్తి చేసి దేవాలయ అభివృద్ధికి సహకారం అందించినందుకు గ్రామస్తులందరికీ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ పి.లింగారెడ్డి, సీనియర్ నాయకులు అల్వాల్ రెడ్డి, బన్నె శ్రీధర్, పి.పరమేశ్వర్, ఎల్.తిరుపతయ్య, ఎల్.లాలయ్య, జి.బాలస్వామి, లింగం, శ్రీను, బన్నె శ్రీను, బన్నె మల్లయ్య, ఎం.బుచ్చిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

Previous Post Next Post