ఘనంగా బాలసుబ్రమణ్యం జన్మదిన వేడుకలు
హైదరాబాద్, జూన్ 7 (మనఊరు ప్రతినిధి): గాన గాంధర్వ S.P. బాలసుబ్రమణ్యం జన్మదిన వేడుకలు... పల్లవి చరణ్ మ్యూజిక్ అకాడమీ చైర్పర్సన్ జి. వి. రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏకగళరాధన కార్యక్రమం చిక్కడపల్లిలోని త్యాగరాజగానసభ దీక్షితులు హాలులో కొనసాగినది ఈ కార్యక్రమంలో పద్మ పాడిన పాటలు ప్రేక్షకులనే ఎంతో ఉత్సాహ పరచడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా వచ్చినవారు ప్రేక్షక మహాశయులలో ప్రేక్షకుల్లాగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని తిలకించడం జరిగినది. రమణారెడ్డి పద్మ పోటీ పోటీగా ఏక గాళ రాధనలో ఒకరు ఒకరు పోటీగా పాడినారు. సోలో గీతాలు రమేష్ నాయుడు, కె.వి.మహదేవన్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, మాస్టర్ వేణు, చక్రవర్తి సంగీతం సమకూర్చిన గేయాలను ఎన్నుకొని ఒకరికి ఒకరు పోటీ పడి పాటలు పాడడం జరిగినది. ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం త్యాగరాజు గాని సభ దీక్షితులు హాలు నందు జరిగినది. ఈ కార్యక్రమంలో విశ్వనాధ్, అంజనీ కుమారి, వినోద్ గౌడ్, గాయకులు రాజారాం, గాయకులు అబ్రహం,
సంసన్, రవికుమార్, కృష్ణ ప్రసాద్, లక్ష్మణ్ నండూరి, కిషోర్ మొదలగువారు పాల్గొనడం జరిగినది, బాలసుబ్రహ్మణ్యం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని శ్రీ రమణారెడ్డి జరిపించడం జరిగినది. ప్రేక్షకులను ఎన్నుకున్న పాటలతో మంత్ర ముగ్ధుల్ని చేసినారు. వర్ధమాన గాయని పద్మ పాడిన పాటలు ప్రేక్షకులను ఎంతో ఉత్సాహపరిచినాయి, ప్రేక్షకులతో హాలు మొత్తం నిండి పోయినది. ప్రేక్షక మహాశయులుగా విచ్చేసిన అతిధులు ఇలాంటి మంచి కార్యక్రమాలు రమణారెడ్డి, మునుముందు చేయాలి. ఈ కార్యక్రమం ఎంతో హుందాగా చేపట్టినారు. కొత్త పాత అనేది లేకుండా వచ్చిన గాయనీ గాయకులు మంచి పాటలను ఎంపిక చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కొనసాగించినారు,