_*ప్రతి జర్నలిస్టుకు బీమా చేయిస్తా*_
_*జర్నలిస్టులందరూ నాకు ఆత్మీయులే*_
_*నిజాలను నిర్భయంగా రాయడమే నిజమైన జర్నలిజం వృత్తి.*_
_*వాస్తవాలను తెలుసుకొని నిర్భయంగా రాస్తేనే సమాజానికి మేలు.*_
_*గ్రామస్థాయి నుంచి వచ్చిన నాకు జర్నలిస్టుల సమస్యలు తెలుసు.*_
_*అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు వర్తింప చేస్తాం.*_
_*త్వరలోనే జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం నిధులు మంజూరుపై హామీ.*_
_*జర్నలిస్టుల ఆత్మీయ సమ్మేళనం జర్నలిస్టులకు అండగా ఉంటా*
నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, జూన్ 8 (మనఊరు ప్రతినిధి): ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని ఒక సామాన్య వ్యక్తిగా ప్రజలతో మమేకమై నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి నియోజకవర్గంలోని జర్నలిస్టులతో నిర్వ హించిన ముఖాముఖీ (చిట్ చాట్ ) కార్యక్రమంలో మాట్లాడుతూ... నియంత్రుత్వ పోకడాతో కాకుండా స్నేహపూర్వకంగా ఎవరి ఆత్మగౌ రవం దెబ్బతీసేలా ప్రవర్తించకుండా స్వేచ్ఛయుత వాతావరణంలో పరి పాలననందిస్తానన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులాగా ఉన్న జర్నలిస్టుల నిజాలను, సమస్యలను నిర్భయంగా రాయాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో వనపర్తి నియోజకవర్గంలో నిత్యావసరాలు లోటుతో అభివృద్ధి జరిగిందని, సామాన్య ప్రజలకు నిత్యావసరాలను సమాకుర్చడంలో రైతులకు, వ్యాపారస్తులకు మౌలిక వసతులు, సాగు నీరు, విద్యుత్ సౌకర్యాలు కల్పించడం విఫలమైద న్నారు. నిర్లక్ష్యానికి, నిస్పృహకు లోనైనా ప్రతి రంగాలను కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి తార్కణంగా చేసి చూపిస్తాన్నారు. చాలా ఏండ్లుగా అసంపూర్తిగా మిగిలిపోయిన వనపర్తి జిల్లా మండలాల ప్రెస్ క్లబ్ స్థలం, భవనం నిర్మాణం, అర్హులైన ప్రతి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు, యువకిరణం పథకం వర్తింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు తాను బాధ్యత తీసుకుంటాని హామీ కల్పించారు. జర్నలి స్టుల పిల్లలు, కుటుంబ సభ్యులకు విద్యా, వైద్యం రంగాలలో రాయితీపై సేవలను అందించేలా, ప్రతి జర్నలిస్టు కు ఒక లక్ష యాభై రూపాయల భీమా సౌకర్యం తాను చేయిస్తానన్నారు.