*ప్రభుత్వ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో "ప్రైవేటు పెత్తనం"*
*షాద్ నగర్, ఫరూక్ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ప్రయివేటు వ్యక్తుల సిబ్బంది జోరు*
*అన్ని తెల్సినా చోద్యం చూస్తున్న ఏసీబి, ఉన్నతాధికారులు*
*నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహారిస్తున్న ఉన్నత అధికారులు*
షాద్ నగర్, జూన్ 9 (మనఊరు ప్రతినిధి): అక్కడ ఇక్కడ ఏమో గాని మన షాద్ నగర్ ఫరుఖ్ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులలో పరిస్థితి రానురాను రాజు గుర్రం గాడిద అయినట్టు కనిపిస్తోంది. మన షాద్ నగర్ పేరు చెబితే ఏ దేశంలోనైనా గుర్తు పట్టని వారు ఉండరు ఇక్కడ ఎందుకంటే సంచలనాలకు పుట్టినిల్లు పేరు పెట్టినిల్లు మన షాద్ నగర్ క్రైమ్ పరంగా దిశా చట్టం చేసారు. కొన్ని ప్రభుత్వాలు వ్యాపారం పరంగా తీసుకుంటే ఇక్కడ లేని వ్యాపారం పరిశ్రమలు కానీ మైక్రో డాటా సెంటర్లు ఎన్నో పార్మసి కంపెనీలు ఇలా చెప్పు కుంటే పొతే రియల్ ఎస్టేట్ లో మనకు మించిన వారు లేరనట్టుగా ఒక దశలో షాద్ నగర్ ఉన్నది. కానీ ఇక్కడ వచ్చే అధికారులు బదిలీ అయి వచ్చినాక మంచిగానే ఉంటారు ఒక నెల గడిచిన తరువాత వచ్చే ప్రజల అవసరాలను ఆయువు పట్టి వాటికీ క్యాష్ చేసుకుంటారు. అలాగే మరి సబ్ రిజిస్టర్ అధికారుల వరకు వస్తే రాష్ట్రంలో ఒకలాగా మన దగ్గర ఒకలాగా ఉంటది అన్నది అందరికీ విదితమే. చలనం లేకుండా ఉన్న పై ఉన్నత అధికారులు ఇక్కడ అవినీతి జరగట్లేదా అంటే అందరికి కనిపిస్తున్న నోరు మేదపని పరిస్థితి. మరియు కండ్లకు కనిపిస్తున్న ప్రయివేటు సిబ్బంది గత కొన్ని ఏండ్లుగా ఇక్కడే తిష్ట వేసి పని చేస్తున్న ప్రయివేటు సిబ్బంది వీళ్ళకి రోజు వారి జీతాలు ఎక్కడివి ఎక్కడ నుండి ఇస్తున్నారు..? వీళ్ళని ఎవరు నియమించారు? ఎందుకు నియమించారు? ఇలా చెప్పుకుంటూ పొతే వీళ్ళ వసూళ్ళ కోసం వీళ్ళ పై ఆధారపడి సబ్ రిజిష్టర్ రోజు వారి మాములల్లో వీరికి జీతాలు బత్యాలు చెల్లిస్తునరాని అందరికి తెలిసిన అంశమే. వ్యక్తిగత ప్రయివేటు సిబ్బందిని పెట్టుకొని దోచుకుంటున్నారు.. ఇదంతా పై అధికారులకు తెలియకుండా లెదు ఆలా నిఘా విభాగం అని ఏసీబి అధికారులకు కూడా తెల్సు కానీ పట్టుంచుకునే నాధుడు లేక విచ్చల విడిగా వీళ్ళకు ఇష్టము వచ్చినట్లు ఇష్టం ఉన్న దస్తావేజులను మాత్రమే చేస్తూ అమ్యమ్యలు ఉంటే ఒకలాగా లేకుంటే ఒకలాగా డాక్యుమెంట్లు చేస్తూ ఇప్పుడు స్లాట్ లు షాద్ నగర్ ఆఫీసులో స్లాటు బుక్ అయితే ఫరూఖ్ నగర్ కు సంబంచి అక్కడ సబ్ రిజిస్టర్ అధికారి లేని అక్షేపణలు చేసి ఫరుఖ్ నగర్ లో చేయించుకో అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఈయన ఒక కొత్త చట్టంకు తెర లేపారు. ఫరుఖ్ నగర్ ఎస్ఆర్ఓ నేను ఏమి తక్కువ కాదు అంటూ ఒక దస్తావేజు రిజిష్ట్రీ కావాలంటే ఈయన దగ్గర పడిగాపులు కాయాలి ప్రదక్షణలు చేయాలి. దేవుడు వరమిచ్చినా పూజారులు వరం ఇవ్వాలి అన్నట్టు వీళ్ళ దయతో రిజిష్టర్ చేసుకోవాలి. ప్రభుత్వం రెవెన్యూ మార్గాలు పెంచండి అంటే వీళ్ళు మన ప్రాంత వాసులను ఒక ఆట ఆడుతున్నారు ఇక ప్రభుత్వం అయినా ఏసీబి అధికారులు అయినా ఉన్నత అధికారులు అయినా వీరి పై దృష్టి సారించి వీళ్ళను ఇక్కడ నుండి బదిలీ అయినా లెదా వీరి పై కఠిన చర్యలు తీసుకోవాలి అని షాద్ నగర్ నియోజక వర్గ ప్రజలే కాకుండా ఇతర ప్రాంత ప్రజలు కూడా కోరుకుంటూన్నారు ఎ మేరకు చర్యలు ఉంటాయో వేచి చూడాలి. ఉదయం వసూళ్లైన అమ్యమ్యాలు సాయంత్రానికి ప్రైవేట్ సిబ్బందితో వసూలు చేయిస్తారు ఎందుకంటే వాళ్లే కీలకం. ప్రైవేటు వర్గాల పెత్తనమా మజాకా..?