భారత రాజ్యాంగం రాసిన. మహనీయుడు అంబేద్కర్మా
మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి
బాలానగర్, ఏప్రిల్ 14 (మనఊరు ప్రతినిధి): భారత రాజ్యాంగం రాసిన మహనీయుడు, రిజర్వేషన్ లను పార్లమెంట్లో పేట్టి అణగారిని కులాలకు నాంది చూపిన మహా నాయకుడు డా. బాబా సాహెబ్. అంబేద్కర్ అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వైస్ ఎంపీపీ వెంకటాచారి అన్నారు. సోమవారం రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసే ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పూలమాలలు వేసే నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రజా పాలనకు దిక్సూచి, అంబేద్కర్ జీవిత చరిత్ర విద్యార్థులు చదువుకొని సమసమాజ నిర్మాణం కోసం, విద్యాభివృద్ది కోసం, దేశం కోసం పాటుపడాలి అన్నారు. ఆయన భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్మ స్ఫూర్తిని విశ్వవ్యాపితం చేసిన కీర్తి శిఖరం, భారతరత్న డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆచారి, సంఘం అధ్యక్షుడు మదవాచారీ, చక్రం, కుమార్, రవిచారీ, శ్రీను, రవి, శేఖర్, పాల్గొన్నారు.