ఆంధ్రప్రదేశ్ భవన్ ను ఖాళీ చేయించిన ఎన్ టీ ఆర్

 ఆంధ్రప్రదేశ్ భవన్ ను ఖాళీ చేయించిన ఎన్ టీ ఆర్

కడప, మే 29 (మనఊరు ప్రతినిధి): ముఖ్యమంత్రి గా 1983 లో ఎన్టీఆర్ పార్టీ పెట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ఢిల్లీకి కర్టసీ కోసం ప్రధానమంత్రి ఇందిరా గాంధీని కలవడానికి వెళితే అధికారులు తమిళనాడు భవన్ లో బస ఏరాటు చేశారు. అదేంటీ మనకు ఆంధ్రప్రదేశ్ భవన్ లేదా అని రామారావు అడిగారు. ఉంది అది ఉత్తరప్రదేశ్, బీహార్ కాంగ్రెస్ నాయకులు రౌడీలు ఆక్యుపై చేశారని చెప్పారు. ఐతే వాళ్ళను కాళీ చేయించండీ అన్నారు. రామారావు అది అంత ఈజీ కాదు. కరుడు కట్టిన నేరస్తులు వాళ్ళు. అని అధికారులు చెప్పారు. అపుడు ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోను కలపండీ అని రామారావు అన్నారు. అధికారులు భయపడ్డారు నో..వెంటనే కలపండీ అని హుకుం జారీ చేశారు. అపుడు రామారావు 48 గంటలు టైము ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భవన్ ను కాళీ చేయించి మాకు అప్పజెప్పమని వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రి ఆఫీసు విస్తు పోయింది. ఓ దక్షిణాది ముఖ్యమంత్రి వచ్చి ఢిల్లీలో ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారి అని ఆశ్చర్య పోయారు. వెంటనే ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో మాట్లాడి మిలటరీ సహాయంతో ఆంధ్రప్రదేశ్ భవన్ ను ఖాళీ చేయించి 48 గంటలలో అప్పజెప్పారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవక ముందే జరిగిన సంఘటన ఇది. అది NTR అంటే అది తెలుగువాడి ఆత్మగౌరవం అంటే. ఢిల్లీలో భారత దేశానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వారు అని ఒకరు ఉన్నారు అని తెలియ జేసిన మహాను భావుడు నందమూరి తారకరామారావు అలాంటి మహాను భావులను తలుచుకోవడం మన అధ్రృష్టం అని ప్రజలు అనుకుంటున్నారు.

Previous Post Next Post