*ఆంజనేయుడిలా అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెగువ కావాలి*
*షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్*
*హనుమాన్ జయంతి సందర్భంగా చౌడమ్మ గుట్టలో ప్రత్యేక పూజలు*
*ఎమ్మెల్యే శంకర్, అనురాధ దంపతులకు ఆశీస్సులు*
షాద్ నగర్, మే 22 (మనఊరు ప్రతినిధి): ఉన్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే తెగువ ఆంజనేయుడదని ఆ స్వామినీ నమ్ముకున్న వారికి ఎలాంటి భయం అవసరం లేదని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం పట్టణ శివారులోని చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయంలో ఎమ్మెల్యే శంకర్ ఆయన సతీమణి అనురాధ తదితర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు పురోహితులు ఆశీస్సులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శంకర్ మీడియాతో మాట్లాడుతూ..
అసాధారణ కార్యదక్షత, భయాన్ని, నిరాశనిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి హనుమ సొంతం అన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆ శ్రీరామ భక్తుడి ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా ఆంజనేయుడి నామాన్ని స్మరిస్తే ధైర్యం వస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట మాణిక్యం తదితరులు ఉన్నారు.