*పొయోస్తారా సార్..!*
*షాద్ నగర్ ఏసిపి రంగస్వామిని సన్మానించిన ఎమ్మెల్యే*
షాద్ నగర్, మే 22 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సహజమని, ఎక్కడ విధులు నిర్వహించినా నిబద్ధతతో, నిజాయితీగా ఉండాలని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలుసుకున్న స్థానిక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎసిపి) రంగస్వామి తన బదిలీ గురించి ఎమ్మెల్యేకు వివరించారు. రెండేళ్లకు పైగా ఇక్కడ పోలీసు శాఖ తరపున సేవలు అందించి అందరికీ అందుబాటులో ఉండి నిజాయితీగా వ్యవహరించినందుకు ఎమ్మెల్యే శంకర్ ఏసీపీ రంగస్వామిని శాలువాతో సన్మానించి వీడుకోలు పలికారు. ఎక్కడ పనిచేసినా నిజాయితీగా నిబద్ధతతో ధర్మంగా పనిచేయాలని ఎమ్మెల్యే శంకర్ సూచించారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు సహజమని ఎక్కడ పని చేసినా మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని ఉన్నత అధికారులుగా పేరు సంపాదించి స్థిరపడాలని ఎమ్మెల్యే ఆశించారు. ఈ
సందర్భంగా ఏసిపి రంగస్వామి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటరామిరెడ్డి పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి యువ నాయకులు ముబారక్ ఇబ్రహీం రాయికల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.