ఐఎఫ్ఎస్లో సత్తా చాటిన జడ్చర్ల విద్యార్థి ప్రశాంత్
జడ్చర్ల రూరల్, మే 23 (మనఊరు ప్రతినిధి): కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) - 2024 తుది ఫలితాల్లో జడ్చర్లకు చెందిన గోప్లాపూర్ ప్రశాంత్ 25వ ర్యాంకు సాధించాడు. జడ్చర్లకు చెందిన గోప్లాపూర్ యాదయ్య (కాంగ్రెస్ నాయకుడు) ప్రథమ పుత్రుడు గోప్లాపూర్ ప్రశాంత్. ఈ సందర్భంగా జి.ప్రశాంత్ మాట్లాడుతూ తనకు 25వ ర్యాంకు రావడంపై స్పందిస్తూ, తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఫారెస్ట్ సర్వీస్కు ఎంపికవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. సివిల్స్ సాధించటమే లక్ష్యంగా చిన్నతనం నుంచి అమ్మానాన్నలు తనను అన్ని విధాలుగా ప్రోత్సహించారని తెలిపారు.
ప్రశాంత్ కు హర్షం వ్యక్తం చేసిన మాదిగ ఉద్యోగుల సంఘం
ప్రశాంత్ యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ పరీక్షల్లో 25వ ర్యాంకు సాధించడంతో మాదిగ ఉద్యోగుల సంఘం జడ్చర్ల నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రశాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.