విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి
విజయవంతమైన అవోపా వేసవి శిక్షణ శిబిరం
జడ్చర్ల రూరల్, మే 25 (మనఊరు ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా పదవ తరగతి విద్యార్థులకు ఆవోప ఆధ్వర్యంలో ఉచితంగా విద్యా బోధన శిక్షణ శిబిరాన్ని వేసవిలో నిర్వహించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశామని నెల రోజులపాటు విద్యార్థు లు ఎంతో చక్కగా విద్యను అభ్యసించారని మండల విద్యాధికారి, జిల్లా ఆవోప అధ్యక్షులు పాపిశెట్టి మురళీకృష్ణ తెలిపారు ఆదివారం పట్టణ పరిధిలోని ఉదయ మెమోరియల్ పాఠశాలలో నిర్వహించిన ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత గత నెల రోజులుగా పదవ తరగతి విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించామన్నారు జడ్చర్ల పట్టణ ఉపాధ్యాయుల సహకారంతో తెలుగు ఇంగ్లీష్ మీడియం 150 మంది విద్యార్థులకు ప్రతినిత్యం గణిత శాస్త్రము, భౌతిక రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రము, ఆంగ్లము మొదలగు విషయాలపై తరగతులు నిర్వహించామని తెలిపారు అవోపా వేసవి శిక్షణ శిబిరంలో బోధన నిర్వహించిన ఉపాధ్యాయ బృందాన్ని ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు సబ్ ఇన్స్పెక్టర్ శ్రవణ్ సైబర్ క్రైమ్ మోసాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా మాజీ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, తిమ్మాజిపేట మండల విద్యాధికారి సత్యనారాయణ శెట్టి, ఆవోప పట్టణ ప్రధాన కార్యదర్శి వీర బొమ్మ శివకుమార్, కోశాధికారి శివ, తిరుపతి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.