కొండాపూర్ లో ఘనంగా బొడ్రాయి ప్రతిష్టాపన
శ్రీ ఆంజనేయ స్వామి నూతన శిఖర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నూతన బొడ్రాయి ప్రతిష్టాపన
ధన్వాడ, మే 25 (మన ఊరు న్యూస్ ): ధన్వాడ మండల పరిధిలోని కొండాపూర్ గ్రామంలో మూడు రోజులుగా బొడ్రాయి ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ బొడ్రాయిని ప్రతిష్ఠించారు. గ్రామపెద్దల సమక్షంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. యజ్ఞం నిర్వహించి, శాసోతాకంగ వేదమంత్రాలతో శుక్ర, శని, ఆదివారం నాడు ఎంపీ డీకే అరుణపాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ఆడపడుచులకు అమ్మవారి బోనాలు సమర్పించుట, నైవేద్యం, ముడుపులు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో మహిళలు బోనాలతో అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. మహిళలు మంగళహారతితో ఊరేగిపుగా వెళ్లి గ్రామంలో ప్రతిష్టాపన చేసిన బొడ్రాయి దేవతమూర్తులకు నైవైద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో ఎంపీ డికె అరుణ పాల్గొని స్థానిక బిజెపి నేతలతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అంతకు ముందు ఆలయ మర్యాదల ప్రకారం సాధార స్వాగతం పలికిన అర్చకులు. అనంతరం హనుమాన్ దేవాలయంలో విగ్రహ ప్రస్థాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.