యువశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
నాగర్ కర్నూల్, జూన్ 7 (మనఊరు ప్రతినిధి): ప్రాణాపాయ, అపద సంకట స్థితిలో ఉన్న వ్యక్తికి అవసరమైన రక్తదానం చేయడంతో వారీ ప్రాణాలు కాపాడుటలో యువత ముందుండాలని యువ శక్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాగితాల మధు అన్నారు. శనివారం నాడు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన తిరుపతయ్య తీవ్రమైన రక్తహీనతతో బాధపడుతూ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి లో చికిత్సకు చేరారు. వైద్యులు నిర్ధారించి రక్తం తక్కువగా ఉంది ఎబి పాజిటివ్ రక్తం వెంటనే ఎక్కించాలి అనడంతో ఈ ప్రాంతంలో రక్తం లేకపోవడంతో యువశక్తి ఫౌండేషన్ ద మిషన్ సభ్యులు ప్రదీప్ వెంటనే స్పందించి అతనికి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. ఆరోగ్యవంతమైన యువతి యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని నాగర్ కర్నూలు జిల్లా యువశక్తి ఫౌండేషన్ అధ్యక్షులు మహేందర్ తెలిపారు. శనివారం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ ఆపరేషన్ కోసం ఓ నెగటివ్, వనపర్తి జిల్లాలో తలసీమియా చిన్నారికి బి పాజిటివ్, నారాయణపేట జిల్లాలో గర్భిణీ స్త్రీకి బి నెగిటివ్ రక్తం, పాలమూరు జిల్లాలో గర్భిణీ స్త్రీకి బి నెగటివ్ రక్తం అందించామని కాగితాల మధు తెలిపారు. వివిధ జిల్లాలో యువత ముందుకు రావడంతో రక్తదానం ఉచితంగా అందజేస్తున్నామని ఆయన తెలిపారు. ఆపదలో ప్రాణాపాయ స్థితిలో రక్తం అవసరమైన వారు 9949446340, 9908806285 నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు. రక్తదానం చేసిన యువతను అభినందించారు.