ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు....

 ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు....

ఏడో తరగతిలో చేరిన విద్యార్థిని అభినందిస్తున్న హెచ్ఎం, ఉపాధ్యాయులు

 కల్వకుర్తి, జూన్ 16 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు అవ్వారీ శ్రీనివాసులు తన కుమారుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మార్చాల లో ఏడవ తరగతిలో చేర్పించడం జరిగింది. నేటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ప్రభుత్వం అన్ని విధాల పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నదని ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకాన్ని కల్పించడానికి తన యొక్క కుమారుని మార్చాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్పించడం జరిగిందని ఉపాధ్యాయులు శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సి హెచ్ వెంకట రమణ మాట్లాడుతూ తన కుమారుని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారని ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించి ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత, శ్రీనివాసులు, సి నారాయణ, యాదయ్య, గోపాల్, పాండు, శ్యామలాదేవి పాల్గొన్నారు.


Previous Post Next Post