వృత్తి విద్య కోర్సులలో చేరడం కొరకు దరఖాస్తు చేసుకోండి
- ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ కె. జయమ్మ
కల్వకుర్తి, జూన్ 16 (మనఊరు ప్రతినిధి): వృత్తి విద్య కోర్సులలో చేరడం కొరకు విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కల్వకుర్తి ప్రభుత్వ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ కె. జయమ్మ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. కళాశాలలో కోప, డ్రాఫ్ట్ మెన్ సివిల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, డ్రెస్ మేకింగ్, సోలార్ టెక్నీషియన్ ట్రేడ్స్ యందు మొదటి విడత సీట్ల భర్తీ కొరకు పదవ తరగతి, ఎనిమిదవ తరగతి తీర్ణులైన 14 సంవత్సరాలు పైబడిన వారు అడ్మిషన్ కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చివరి తేదీ 21/06/2025 https://iti. telangana.gov.in అనే వెబ్ సైట్ ను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ గురించి మొబైల్ ఫోన్ నెంబరు, ఎస్ ఎస్ సి మెమో, నాలుగో తరగతి నుండి పదవ తరగతి వరకు బోనఫైట్స్, కుల ధ్రువీకరణ పత్రము, ఈమెయిల్ ఐడి, పాస్పోర్ట్ సైజు ఫోటోతో ఆన్లైన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ఆమె వివరించారు. దరఖాస్తు చేసుకునేవారు SSC మెమోలో, ఆధార్ ధ్రువీకరణ పత్రంలో ఒకే విధమైన పేరు, పుట్టిన తేదీ ఉండే విధంగా చూసుకోవాలని, ఆసక్తి గల విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం కల్వకుర్తి ప్రభుత్వ ఐటిఐ కళాశాల యందు సంప్రదించాలని ఆమె వివరించారు.