సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి...

 సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి....

ఏఎస్సై హనుమంత్ రెడ్డి 

కల్వకుర్తి, జూన్ 4 (మనఊరు ప్రతినిధి): సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కల్వకుర్తి ఏఎస్ఐ హనుమంత్ రెడ్డి అన్నారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకీ సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, వాటిని అవగాహనతోనే నియంత్రించ గలుగుతామన్నారు. అపరిచితులు ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పిస్తామని, లోన్స్ ఇప్పిస్తామని, చెప్పి మోసాలు చేస్తున్నారని అలాంటి కాల్స్ కు మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దన్నారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతా నెంబరు, ఆధారు, ఏటీఎం ఇతర వివరాలు ఎవరికీ తెలియజేయవద్దని పేర్కొన్నారు. సైబర్ నేరస్తుల బారిన పడకుండా ప్రతి జాగ్రత్త పడాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్ ను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ సి పర్వతాలు, కానిస్టేబుళ్లు మల్లేష్, గోపి, పట్టణ వాసులు, తదితరులు ఉన్నారు.

Previous Post Next Post