కిడ్నీ రోగులు ఉచిత డయాలసిస్ సేవలు వినియోగించుకోవాలి

 కిడ్నీ రోగులు ఉచిత డయాలసిస్ సేవలు వినియోగించుకోవాలి 

ప్రభుత్వ సాధారణ ఆస్పత్రి మెడికల్ సూపర్డెంట్ ఆర్. రఘు 

నాగర్ కర్నూల్, జూన్ 17 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఉచిత డయాలసిస్ సేవలకు ఈ ప్రాంత రోగులు ఖాళీగా ఉన్న 10 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు వినియోగించు కోవాలని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఆర్. రఘు తెలిపారు. ఈప్రభుత్వ సాధరణ ఆస్పత్రిలో అపెక్స్ కిడ్నీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ప్రాంతంలోని కిడ్నీ సంబంధిత రోగులకు డయాలసిస్ సేవలు ప్రస్తుతం 46 మంది వినియోగించుకుంటున్నారని, ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వారికి సేవలు మూడు విడుతల లో డయాలసిస్ ఆరోగ్య సేవలు చేస్తున్నట్లు తెలిపారు.ఇంకా ఖాళీగా ఉన్న పదిమంది రోగులకు సేవలు అందించుటకు అవకాశం ఉందని అన్నారు. హెపటైటిస్ సి పాజిటివ్ ఉన్న రోగులు కూడా సంప్రదించవచ్చని ఆయన సూచించారు.ఈ ప్రాంతం వారు డయాలసిస్ ఆరోగ్య సేవల కొరకు నేరుగా ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో అన్ని రకాల రిపోర్టులు,ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు లతో సంప్రదించాలని, లేదా డయాలసిస్ ఇంచార్జ్ పీ. వినోద్ కుమార్ 8185808145, హెల్ప్ డెస్క్ఇంచార్జ్ టి.యాదగిరి 9014932408 నెంబర్ లలో సంప్రదించాలని ఆయన సూచించారు.

Previous Post Next Post