ప్రభుత్వ పాలనకు ప్రతిరూపం ఆ జిల్లా కలెక్టర్..!
పాలనలో తనదైన శైలిలో ముందుకెళ్తున్న జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
కలెక్టర్ ఏడాది ప్రజా పాలన పై ప్రత్యేక ప్రస్థానం
నాగర్ కర్నూల్, జూన్ 16 (మనఊరు ప్రతినిధి): ఓ జిల్లా కలెక్టర్గా ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తూ ప్రజల అభిమానాన్ని చూడకంటూ ఏడాది కాలంగా ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్న ఆ జిల్లా కలెక్టర్ ప్రజా పాలనకు నిదర్శనంగా మారారని సమాజం మెచ్చుకుంటుంది.
విపత్తులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించేలా కలెక్టర్ ఏడాది పాలన, బాధ్యతలు చేపట్టిన రోజే తాను పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చానని..
ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ నయ్యా..
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తా...
జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తా ..
అంగన్ వాడి నుంచి ఆసుపత్రి వరకు ప్రత్యక్ష తనిఖీలు,
జిల్లాలో సమర్థవంతమైన పాలనకు నాంది పలికారు.
ఉద్యోగులు ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పరిపాలన కొనసాగిస్తాం
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐఏఎస్ ఏడాది పాలనపై ప్రత్యేక నివేదిక,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో మూడు పర్యాయా పర్యటనలు విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించారు. నాగర్ కర్నూల్, జూన్ 16, 2025 నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయిన సందర్భంగా, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐఏఎస్ పాలనా రంగంలో తనదైన ముద్రను పదిలంగా వేశారు. తన నిబద్ధత, దార్శనికత, మరియు కఠోర శ్రమతో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో కలెక్టర్ గా భాద్యతలు తీసుకున్న మరుసటి రోజు నుంచే ప్రతి పనిలోనూ తన తనదైన శైలిలో ఉత్తమంగా ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. సమీక్షలు సమావేశాలు, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిశీలన, వివిధ మండలాలలోని గురుకుల, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, అంగన్ వాడి సెంటర్లను, పల్లె దవాఖానలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలను పరిశీలిస్తున్నారు. విధులను సమర్థవంతంగా నిర్వర్తించి, ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో గత సంవత్సరం జిల్లా 23వ స్థానం నుండి, 13వ స్థానానికి చేరుకునేలా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కృషి ప్రత్యేకమైనది. తనదైన శైలిలో ఉత్తమంగా పాలన కోసం తాను క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, అధికారులను పరుగులు పెట్టిస్తూనే, ఊహించని విపత్తులు అధిక వర్షాల వరదలు, ఎస్ఎల్బీసీ వంటి విపత్తులను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూనే జిల్లా అభివృద్ధికి నిర్విరామంగా, అహర్నిశలు కృషి చేస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పై జిల్లా పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కథనం.
ప్రజా ప్రభుత్వం కార్యక్రమాలను విజయవంతముగా నిర్వహిస్తూ...
ప్రజాపాలన - ప్రజావిజయోత్సవాలు వైభవం..
భూ భారతి, నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం పై అన్ని మండల కేంద్రాల్లో విజయవంతంగా అవగాహన సదస్సుల నిర్వహింపజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మరియు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా క్యాంటీన్లు ప్రారంభం.. విజయవంతంగా నిర్వహణ..సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించారు.
జిల్లాలో పేద ప్రజల విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధి పై ప్రత్యేక శ్రద్ధ పెడుతూనే... ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, పకడ్బందీగా అమలు చేస్తూ... సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్. జిల్లాలో తన బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్ల నుంచే అన్ని రంగాలపై దృష్టి సారిస్తూ, పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. మొదటిగా విద్యా వ్యవస్థను ప్రాధాన్యతగా తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు స్వయంగా వెళ్లి విద్యార్థులతో మమేకమై, క్లాసులు నిర్వహించడం ద్వారా వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నారు. “విద్య అనేది సామాజిక మార్పుకు నాంది కావాలి” అనే నినాదాన్ని అనుసరిస్తూ... విద్యార్థులకు లక్ష్యం వైపు స్పష్టత ఇవ్వడం, శ్రద్ధ పెరగడం కోసం వారు తీసుకుంటున్న చర్యలు పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.
విద్యే మార్పుకు నాంది …………ప్రభుత్వ విద్య సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తూ... పాఠాలు బోధిస్తూ... జిల్లా కలెక్టర్ వివిధ ప్రభుత్వ విద్య సంస్థలను ఆకస్మిక తనిఖీ చేస్తూ... పాఠాలు బోధిస్తూ... విద్యాలయాల్లో వసతులు పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్సు, మ్యాథ్స్, ఇంగ్లీష్ తదితర పాఠాలు బోధిస్తూ.. వారిని వివిధ ప్రశ్నలు అడుగుతూ ప్రోత్సహిస్తున్నారు. లక్ష్యం వైపు స్పష్టతను ఇస్తూ భవిష్యత్ ప్రణాళికపై మార్గదర్శిగా నిలుస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మాదిరిగా రైతుకు రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని ఇప్పటి వరకు 2 లక్షల రూపాయల వరకు ఉన్న రైతులకు రుణమాఫీ చేశారు. బ్యాంకులో రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆకస్మికంగా బ్యాంకులను కూడా సందర్శిస్తూ రైతుల బాధ తెలుసుకున్నారు. రైతులను యిబ్బందులకు గురి చేయవద్దని బ్యాంకు ఉద్యోగులకు సూచిస్తూనే, రైతులకు ఇబ్బంది కలిగించకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేశారు.
జిల్లా చరిత్రలోనే ఇప్పటివరకు కొనుగోలు చేయని విధంగా రైతుల నుండి ఈ సంవత్సరం గణనీయంగా వరి కొనుగోలు ప్రక్రియను చేపట్టడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటివరకు కొనుగోళ్ల ప్రక్రియను 90% పూర్తి చేశారు.
ఇలా కలెక్టర్ అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడం కోసం డిపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య ప్రెసిడెంట్, సెక్రటరీలతో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు, అదేవిధంగా గ్రామపంచాయతీలను నిరంతరం తనిఖీలు చేపట్టి, పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని గ్రామపంచాయతీ భవనాలు, మరుగుదొడ్ల ఏర్పాటు, గ్రామపంచాయతీలో సమస్యల పట్ల దృష్టి సారించాలని వాటర్ శుభ్రం చేయాలని జిల్లాలో గల 461 గ్రామపంచాయతీలను ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో లు, ఎంపీవో లు పర్యవేక్షణతో పాటు తనిఖీలు చేపట్టాలని, జిల్లాలో రైతులకు ఎరువులు విత్తనాల కొరత లేకుండా రైతులకు మెరుగైన సేవలు అందించాలని వ్యవసాయ అధికారులకు సూచించి జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా ఎరువుల దుకాణాలను పరిశీలిస్తున్నారు.
కలెక్టర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి తో పాటు, మండలాలలోని ప్రభుత్వ హాస్పిటల్స్ ను, అంగన్వాడి సెంటర్లను, ప్రభుత్వ పాఠశాలలను, నర్సరీలను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచిస్తూ. సాధారణ కాన్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, ఆరోగ్య సమస్యలతో వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, ఆసుపత్రిలో రోగులకు మంచి నాణ్యమైన వైద్యం అందాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆసుపత్రిలో వచ్చిన రోగులను కలెక్టర్ వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లా హాస్పిటల్ లో ఐసీయూలో బెడ్స్, డ్రగ్స్ అలాగే నిరంతరం శానిటేషన్ చేపట్టాలని అలాగే ప్రసూతి కోసం వచ్చే గర్భిణీలకు ఎక్కువగా సాధారణ కాన్పులు ప్రాధాన్యతను కల్పించేలా కృషి చేశారు. ఆసుపత్రులలో ఎక్కడ కూడా మందుల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. జిల్లా ఆసుపత్రిలోని జనరల్ క్యాజువాలిటి, ఆర్థో వార్డులను తనిఖీ చేసి రోగులతో అందుతున్న వైద్యం సేవల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యల పైన ప్రధానంగా దృష్టి సారించి తెలుసుకుంటున్నారు. జిల్లాలోని పాఠశాలకు, గురుకులాలను వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ, మధ్యాహ్నం భోజనాలను విద్యార్థులకు అందించే విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడం విశేషం. అంగన్ వాడి సెంటర్లను పరిశీలిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల ఉద్యోగుల పై చర్యలు చేపడతామని తన పర్యటనలోనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కలెక్టరేట్లో అధికారులు సమయపాలన పాటించాలని బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు.
జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ నిబంధనల మేరకు పక్కా ప్రణాళికతో పారదర్శకంగా పథకాలు అమలు చేయాలని, ప్రభుత్వ పథకాలు జిల్లాలోని ప్రతి మారుమూల గ్రామంలో చేరాలని అలాగే చేపట్టిన పాలమూరు రంగారెడ్డి, మహాత్మ గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల, మార్కండేయ, నల్లమల్ల ఎత్తిపోతల పథకాల నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు, కావలసిన భూసేకరణ పనుల పురోగతిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి భూ సేకరణ ప్రక్రియను చివరి దశకు తీసుకువచ్చారు. ఎలాంటి సమస్యలు ఉన్నా సత్వరమే పరిష్కరించాలని సూచిస్తున్నారు. ప్రతి అధికారి, గ్రామ స్థాయి సిబ్బంది, పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని, ప్రతి పనిలో ప్రజా భాగస్వామ్యం ఉండాలని, పథకాల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతి చట్టం అమలు పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అధికార యంత్రాంగానికి సరైన దిశానిర్దేశం చేసి పాలనపై పట్టు సాధించారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి పథకంపై పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగాన్ని నిమగ్నం చేశారు. పలు శాఖలలో అకస్మిక తనిఖీలు నిర్వహించి సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలో అన్ని శాఖలలో పాలనపై తన దైన శైలిలో ముద్ర వేశారు.
గత అనుభవాల దృష్ట్యా ప్రతి పథకం అమలుకు ముందస్తు ప్రణాళికలతో విజయవంతానికి కృషిచేశారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కుల గణన కుటుంబసర్వే, రైతు రుణమాఫీ, భూ భారతి నూతన చట్టం, ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం, ఇందిరా మహిళా శక్తి పథకం, గురుకులాల్లో విద్యార్థులకు నూతన మెనూ, జిల్లాలో ఇంటర్, పదవ తరగతి పరీక్షలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో మూడు పర్యాయా పర్యటనలు విజయవంతం చేయడంలో కీలక భూమిక పోషించారు.
అలాగే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. జిల్లా కేంద్రానికి స్థానిక సమస్యలపై జిల్లా వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాల ఫిర్యాదులు తో జిల్లా కేంద్రానికి అధిక సంఖ్యలో రావడంతో మండల, డివిజన్ స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి అక్కడి కక్కడే సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవచూపారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సొరంగంలో ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూనే సహాయక చర్యలను ముమ్మరం చేశారు. సహాయక చర్యలను 24 గంటల పాటు అక్కడే ఉంటూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ నే, సహాయక చర్యలో పాల్గొని బృందాలకు ధైర్యాన్ని నింపుతూ నిర్విరామంగా పనిచేశారు.
ప్రకృతి విపత్తులు, అకాల ప్రమాదాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొంటూనే , జిల్లా ప్రజలకు విజయవంతంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు.
నల్లమల్ల ప్రాంతంలోని చెంచుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజా తి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్ యోజన) పథకం ద్వారా 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలు విడతల వారీగా చేపట్టారు. చెంచు పెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణం ప్రతిపాదించి, పనులు ప్రారంభించారు. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్ కార్డులు అందజేశారు. ప్రత్యేకంగా మెడికల్ వాహనం ఏర్పాటు చేశారు. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పంపించారు. చెంచుపెంటల్లో నివసించే ప్రజల విద్యా అభ్యున్నతికి కలెక్టర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ దక్షతకు, నిబద్ధతకు ప్రతీక.. గత ఏడాది కాలంలో, కలెక్టర్ పరిపాలనలో అద్భుతమైన మార్పులను తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంలో ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం. ప్రతి ఫిర్యాదును వ్యక్తిగతంగా పరిశీలించి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ, జవాబుదారీతనాన్ని పెంచడంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, కృషి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను పెంపొందించడం, అవినీతికి తావు లేకుండా చూడటం ఆయన ప్రధాన లక్ష్యాలుగా నిలిచాయి.
ఇందిర సౌర గిరి జల వికాస పథకం ద్వారా పోడు భూములను వ్యవసాయ యోగ్యంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకం ప్రారంభం ఏర్పాట్లను అతి తక్కువ సమయంలోనే క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం జిల్లా కలెక్టర్ ను అభినందించారు.
మంత్రుల నుంచి ప్రశంసలు అందుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, ఆదేశాల మేరకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా ఉమ్మడి జిల్లా ఇన్ చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ కూచూకుళ్ళ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ల తో నిరంతరం సమన్వయం చేసుకుంటూ వారి ప్రశంసలు అందుకుంటూ నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు సుపరిపాలన అందిసున్నారు.