ప్రయివేటులో పుస్తకాల దందా

 ప్రైవేటు’ పుస్తకాల దందా

యూనిఫాం, బెల్టుల పేరుతోనూ దోపిడీ

పాఠశాలలోనే కొనాలంటూ నిబంధన

*ప్రైవేటు స్కూళ్లలో ఏటా వందల కోట్ల పుస్తకాల వ్యాపారం

 ప్రభుత్వ పుస్తకాలకు అదనంగా భారీగా ప్రైవేటు బుక్స్*

*తప్పనిసరిగా కొనాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి నగదు రూపంలో మాత్రమే చెల్లింపులు.. రసీదు ఇవ్వరు

*లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు

విద్యాశాఖ అధికారులు 

అశ్వారావుపేట, జూన్ 29 (మనఊరు ప్రతినిధి): తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల ఒకే ఒక్క ఆశ కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలలకు ఆదాయం తెచ్చి పెడుతోంది. తల్లిదండ్రుల నుంచి పాఠశాలల యాజమాన్యాలు వేలకు వేలు ఫీజుల భారం మోపుతున్నాయి. అడ్మిషన్‌ ఫీజు, బిల్డింగ్‌ ఫీజు, కంప్యూటర్‌ ల్యాబ్‌, ట్యూషన్‌, స్పోర్ట్స్‌, స్పెషల్‌ డేస్‌, కమ్యూనికేషన్‌ ప్రోగ్రాం ఫీజులంటూ ఇప్పటికే వేలాది రూపాయలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు మళ్లీ పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫారం, షూ, టీ షర్ట్‌ అంటూ అందినకాడికి దోచుకుంటున్నాయి. అశ్వారావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిభందనాలు పాటించని ప్రైవేట్ పాఠశాలలు, పుస్తకాలు, యూనిఫామ్ రూపేణా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో వసూలు, అడిగితె మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని విద్యార్థుల తల్లిదండ్రులకి దురుసు సమాధానం, తీసుకున్న వాటికీ రసీదులు ఇవ్వని వైనం. ఫీజులు పెరిగి సామాన్య మానవుడు బ్రతుకులో ఫీజులు బాధ గట్టేకేది ఎప్పుడు అని సగటు పిల్లల తల్లిదండ్రుల ఆవేదన.మా దృష్టికి లిఖిత పూర్వకముగా పిర్యాదు చేస్తే కఠిన చెర్యలు తప్పవని అధికారుల సూచన.అదేకకా కొన్ని నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు. కొన్ని పాఠశాలలో కాలం చెల్లిన వాహనాలు,వాహనాలకి ఇన్సూరెన్స్ లు, కాగితాలు లేని వాహనాలు మరియు పరిమితి కి మించి వాహనాల్లో పిల్లల తరలింపు. ఇకనైనా సంభంధిత అధికారులు చెర్యలు తీసుకోవాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు సూచన.

Previous Post Next Post