విద్యార్ధులు మార్పు కోసం ముందంజ వేయాలి — డాక్టర్ భూపతి రజినీ దేవి
కౌన్సిలింగ్ విద్యార్ధుల సర్టిఫికెట్ వేడుకలో డాక్టర్ రజినీ దేవి
సైకాలజీ శిక్షణలో చేతన సైకాలజి లెర్నింగ్ సెంటర్ సేవలు ప్రశంసనీయమైనవి - డా. భూపతి రజినీ దేవి
చేతన సైకాలజి లెర్నింగ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కౌన్సిలింగ్ విద్యార్ధుల సర్టిఫికెట్ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరైన ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ భూపతి రజినీ దేవి కౌన్సిలింగ్ సైకాలజీ అనేది కేవలం ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఇది మనిషి మనసును అర్థం చేసుకునే కళ అని అన్నారు. డా రజనీ దేవి చేతన సైకాలజీ లెర్నింగ్ సెంటర్ నిర్వహించిన కౌన్సిలింగ్ సైకాలజీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ముకరంపురలోని అపూర్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సర్టిఫికెట్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డా రజనీ దేవి మాట్లాడుతూ ఈ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు భవిష్యత్తులో వ్యక్తిగతంగానే కాక సమాజంలో కూడా మార్పు తీసుకువచ్చే మార్గదర్శులుగా ఎదగాలి. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే బాధ్యత ఇప్పుడు మీ భుజాలపై ఉంది అని తెలిపారు. ఈ సందర్భంగా చేతన సైకాలజీ లెర్నింగ్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత సైకాలజీ కౌన్సిలింగ్ కోర్సులో 90 మంది నమోదు చేసుకోగా 37 మంది ఉత్తీర్ణులైనట్టుగా వీరికి సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు.అనంతరం సైకాలజీ విద్యార్థులు డాక్టర్ రజినీ దేవిని శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమం లో దేశబోయిన దివ్యభారతి, చొప్పదండి హరిత, పస్ల భవాని, ఓరగంటి స్వప్న, మునిగంటి సతీష్, సత్యానందం, పీక రాకేష్, గుండాల రామకృష్ణ, నకిడి ప్రదీప్, వై రమేష్ తదితరులు హాజరయ్యారు.