*నా రాజకీయ జీవితంలో అవినీతి చేయలేదు.*
*ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలి.*
*బాధ్యత గల వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేయొద్దు..*
*కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగడం కరెక్ట్ కాదు..*
*గతంలో జడ్చర్లలో ఎప్పుడు ఇలాంటి సంస్కృతి లేదు..*
*వంద పడకల హాస్పిటల్ నిర్మాణం కోసం నేను రెండు ఎకరాలు ఇచ్చాను..*
*ఎమ్మెల్యే పక్కన ఉన్న మరో రెండు ఎకరాలు ఇప్పించాలి..*
*ప్రభుత్వం మీదే ..బిఆర్ఎస్ నేతల అవినీతి, కబ్జాలు నిరూపించాలి..*
*నిరూపిస్తే పార్టీ పరంగా కూడా చర్యలు తీసుకుంటాం.*
*బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారు*
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి
జడ్చర్ల రూరల్, జూన్ 29 (మనఊరు ప్రతినిధి): నియోజకవర్గంలో ఎలాంటి కబ్జా జరిగిన వాటి సర్వే నంబర్లులో కబ్జా జరిగిందో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిరూపించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సి. లక్ష్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రేమ్ రంగా గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. మా మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు. బాధ్యత గల వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేయొద్దన్నారు.జడ్చర్ల రాజకీయాల్లో కుటుంబ సభ్యులను లాగడం ఎప్పుడు లేదన్నారు.జడ్చర్ల ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది మాకు చేతనైన అభివృద్ధి చేశామన్నారు. తరువాత వచ్చిన వాళ్ళు ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దుకొని ముందుకు వెళ్లాలన్నారు.మా అక్క మీద రెండు ఎకరాల భూమి ఎక్కడుందో నిరూపిస్తే ఇచ్చేస్తామన్నారు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం రెండు ఎకరాలు కొని నిర్మాణం చేస్తే మా మీద ఆరోపణలు చేయడమేంటన్నారు.ఎమ్మెల్యే పక్కనే ఉన్న మరో రెండు ఎకరాలు కూడా ఆసుపత్రికి ఇప్పించాలన్నారు. నియోజకవర్గంలో చాలా చోట్ల అసైన్మెంట్ ల్యాండ్ తీసుకొని వారికి డబ్బులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో కూడా ఇదే విధంగా చేశామని తెలిపారు. ఆసుపత్రి రోడ్డు నిర్మాణం కోసం అయ్యే ఖర్చు భరిస్తానని ఆయన తెలిపారు. పాత బజారుకి భారీ వాహనాలు వెళ్లాడానికి ఎటువంటి ఇబ్బంది లేదని.. అంబేద్కర్ చౌరస్తా వద్ద డివైడర్ ఓపెన్ ఉంటుందని తెలిపారు. స్లో అయ్యి రైట్ తీసుకొని వెళ్లొచ్చన్నారు. ఎర్రగుట్టలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్దిదారులకు దక్కాలన్నారు. అర్హులైన వారికి కేటాయించి మిగతా వారిని ఖాళీ చేయిస్తే మాకేం అభ్యంతరం లేదన్నారు. ఎన్నికల తరువాత ఇండ్లను కొంతమంది ఆక్రమించుకుంటే మాకేం సంబంధం అన్నారు. అయినా అధికారులు విచారణ చేపట్టి నిజమైన లబ్దిదారులకు ఇండ్లు కేటాయించాలన్నారు. ఉద్దండపూర్ పరిహారం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని... కెసిఆర్ ని ఒప్పించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ముప్పై శాతం పెంచామని గుర్తు చేశారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 25 లక్షల పరిహారం ఇప్పించాలన్నారు. తమకు పోలీసులు అవసరం లేదని, ప్రస్తుతం ఎందుకు ఎస్ కాట్ ను వినియోగించుకుంటున్నావని విమర్శించారు. మంత్రులు మాత్రమే ఎస్ కాట్ ను వినియోగించుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుడే ఎమ్మెల్యేపై చేస్తున్న ఆరోపణలు చాలవా అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నల్లకుంటా, దేవాలయ భూమి కబ్జా కాదా అని గుర్తు చేశారు. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కబ్జా అయినప్పుడు అధికారం మీదే కదా వెలికితీసి ప్రజలకు చూయించు అని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఫోటో కాల్ పాటించామన్నారు. ఎమ్మెల్యే మాత్రుమూర్తి, సోదరుడులా అధికారంలో ఉన్న పనులకు, చెక్కుల పంపిణీ కార్యక్రమాలు చేయలేదన్నారు. ఇసుక మాఫియా చేయలేదన్నారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్ పర్సన్ పుప్పలత, నాయకులు పిట్టల మురళి, సుదర్శన్ గౌడ్, హఫీజ్, యాదయ్య, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.