*ప్రమాదవశాత్తు తాడిచెట్టుపై నుంచి పడి గీతా కార్మికుడు మృతి*
భూపాలపల్లి, రేగొండ, జూన్ 13 (మనఊరు ప్రతినిధి): ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుంచి జారిపడి మృతి చెందిన ఘటన రేగొండ మండలంలోని జూబ్లీనగర్ లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాళ్లపల్లి రాములుగౌడ్ (48) గీత వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో సాయంత్రం 5:45 గంటలకు వృత్తిరీత్యా తాటి చెట్టు ఎక్కుతూ మోకు జారి పైనుండి క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య, ఐదుగురు కుమారులు ఉన్నారు. మృతుడికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. గీతా కార్మికుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రభుత్వ అధికారులకు సమాచారం అందజేసిన *తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే రేగొండ మండలం జూబ్లీనగర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాళ్లపల్లి రాములు గౌడ్ (48) శుక్రవారం సాయంత్రం 5:45 గంటలకు వృత్తిరీత్యా తాటి చెట్టు ఎక్కుతూ మోకు జారి పైనుండి క్రిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడే ఉన్న తోటి గీతా కార్మికులు శ్రీపతి ప్రభాకర్ గౌడ్ కు సమాచారం అందించగా వారు వెంటనే ప్రభుత్వాధికారులకు తెలియజేశారు. ప్రభుత్వం గీత కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలని సేఫ్టీ మొక్కులు అన్ని గ్రామాల్లో అందరికీ అందేలా చూడాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారు కొండపాక సాంబయ్య గౌడ్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు, గౌరవ అధ్యక్షులు ఏరుకొండ సంపత్ కుమార్ గౌడ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం రామచంద్ర గౌడ్ తెలంగాణ గౌడ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మామిళ్ల శ్రీనివాస్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు తడక సుధాకర్ గౌడ్ ఆరెల్లి నరేందర్ గౌడ్ చిత్తరంజన్ గౌడ్ గడ్డం సదానందం గౌడ్ బుర్ర రమేష్ గౌడ్ చిట్యాల పెరుమాండ్ల తిరుపతి గౌడ్ ముత్యాల రాజబాబుగౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులు తెలియజేశారు.