పి వి తెచ్చిన సంస్కరణలు దేశ ఆర్ధిక వ్యవస్థ పటిష్టం చేసాయి..
తొలి తెలుగు ప్రధానిగా పి వికి ప్రత్యేక స్థానం…
- పీవీ జయంతి వేడుకల్లో బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మంగు రాఘవ రావు
బాలాపూర్, జూన్ 28 (మనఊరు ప్రతినిధి): మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ రజనీతుజ్ఞుడు స్వర్గీయ పీవీ నరసింహ రావు గారి 104వ జయంతి సందర్భంగా నాదర్ గుల్ లోని జై సూర్య పట్నం కాలనీ కమ్యూనిటీ హాలులో బడంగ్ పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం మహిళా అధ్యక్షురాలు సుధారాణి కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆయన చిత్రపటానికి బడంగ్ పేట నగర బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మంగు రాఘవరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ ఆలోచనలు, ఆయన ఆర్థిక‑పార్టీ‑భారత రాజకీయ రంగాల్లో ప్రవేశపెట్టిన సంస్కరణలు మన దేశాన్ని అభివృద్ధి మార్గంపైకి తీసుకెళ్లారని అన్నారు. ఒక తెలుగువాడిగా దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన తొలి ప్రధామంత్రిగానే తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఇవి భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వేదికలో నిలిచేలా గ్లోబల్-ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టారని తెలిపారు. అంతకు ముందు గణపతి ప్రార్ధన తో ప్రారంభించి పలువురు వక్తలు భారత జాతి ముద్దు బిడ్డ పి.వి గురించి బహుభాషా కోవిదుడు సరస్వతీ పుత్రులు తొలి తెలుగు మాజీ ప్రధాన మంత్రిగా ఆర్థిక సంక్షోభం లో చిక్కుకొన్న భారత దేశాన్ని ఒక రాజనీతిజ్ఞుడు గా అపర చాణక్యుడుగా ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కాపాడిన ముద్దు బిడ్డ గా అభివర్ణించారు వారు మరణించినప్పడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన రీతిలో అధికార లాంఛనాలతో అంతిమ యాత్ర చేయక పోవడం ఇప్పటికీ బాధాకరం అని దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు పి వి ఒక వ్యక్తి గా కాకుండా అతీత శక్తి గా అందరి వాడుగా కుల మతాలకు అతీతంగా కేవలం సమాజాభివృద్ధికి సంక్షేమానికి మాత్రమే పాటు పడిన మహా మేధావిగా వారి బాటలో అందరం ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాల్సిన భాధ్యత ఉందని అన్నారు. సుధారాణి కృష్ణంరాజు మాట్లాడుతూ ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తున్నామని అదనంగా బ్రాహ్మణ సంఘం మహిళా అధ్యక్షురాలిగా నియమించడం మొదటి కార్యక్రమం పి.వి జయంతి చేయడం మరింత భాద్యత పెరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మైథిలి, మహిళా సంఘం సాంస్కృతిక కార్యదర్శి పావని, మాధురి, సహాయ కార్యదర్శి నవీన్ కుమార్, వేముల కవిత, నండూరి ప్రకాశ్, సతీష్ కుమార్, ఉమా శంకర్ రావు, గోగుల పాటి శ్రీనివాసరావు, కొండా రవిందర్, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.