*అన్ని డిఏ లతో కలిపి పి ఆర్ సి ని ప్రకటించండి: ఎస్టీయు*
ఘనంగా 79వ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆవిర్భా వేడుకలు
నాగర్ కర్నూల్, జూన్ 9 (మనఊరు ప్రతినిధి): స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్ టి యు) 79 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయ ఆవరణలో సోమవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు సంఘం మురళి ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ రావుతో కలిసి ఎస్ టి యు పథాకాన్ని ఆవిష్కరించడం జరిగినది.
అనంతరం జిల్లా కేంద్రంలోని ఎస్టియు భవన్ యందు ద్వితీయ కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 19 నెలల కాలం గడిచినా సగటు ఉపాధ్యాయుడు అసహనంతో ఉన్నాడని విద్యారంగంలో పలు మార్పులు ప్రయోగ దశలో ఉసురుమ నిపిస్తున్నాయని, వివిధ కమిటీలతో కాలయాపన తప్ప ఏ ఒక్క ఫలితాన్ని సాధించడం లేదని, అన్ని డిఏలను ఇచ్చి మూడు నెలల్లో పి ఆర్ సి ని ప్రకటిస్తామని ప్రభుత్వం మొండి చేయి చూపిందని వారు వాపోయారు. పెండింగ్ బిల్లులు ఏ ఒక్కటి పాస్ కావడం లేదని, దాచుకున్న జిపిఎఫ్ సొమ్మును సైతం ప్రభుత్వం ఇవ్వడం లేదని నొచ్చుకున్నారు. జిల్లాలోని సగం పాఠశాలలలో ఒకరిద్దరి ఉపాధ్యాయులతో బోధన వలన తరగతికి తగిన నాణ్యమైన విద్య లభించక ప్రైవేటు పాఠశాలల వైపు పేరెంట్స్ మొగ్గు చూపుతున్నారని, చేష్టలుడిగిన ప్రభుత్వం ఉపాధ్యాయులను పలుచన చేస్తున్నదని ఇది సమాజ శ్రేయస్సుకు లాభం చేకూర్చదని వారు అన్నారు. బడిబాట అనంతరము ఉపాధ్యాయుల సర్దుబాటు చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అదనపు కార్యదర్శి ఈశ్వర్, రమేష్, కన్వీనర్ ప్రభాకర్, నాగర్కర్నూల్ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, కార్యదర్శులు బాలస్వామి, నాయకులు కర్ణాకర్ రెడ్డి, శ్రీనివాసుల కాశన్న, తదితరులు పాల్గొన్నారు.