రెండు కళ్ళు దానం చేసిన కోట్ర వెంకటేశ్వర్ల కుటుంబ సభ్యులు...*
ఒకరి నేత్ర దానం -మరో ఇద్దరికి చూపునిస్తుంది
నాగర్ కర్నూల్, జూన్ 9 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని నల్లవెల్లి రోడ్ లో కొట్ర వెంకటేశ్వర్లు వయస్సు (71) సంవత్సరాలు, సోమవారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటలకు గుండె పోటుతో మృతి చెందారు. ఆయన భార్య కోట్ర శశికళ, కుమారులు కొట్ర సుమన్, మనోహర్, మధు, భరత్, కూతురు జయలక్ష్మి కలిసి తమ తండ్రి నేత్రాలను దానం చేయాలని సంకల్పించుకుని వెంటనే స్థానిక ఆప్తాలమిక్ ఆఫీసర్ కొట్ర బాలాజీని సంప్రదించారు. నేత్రాధికారి వెంటనే మహబూబ్ నగర్ లో గల జిల్లా అందత్వ నియంత్రణ సంస్థను సంప్రదించి, మహబూబ్ నగర్ జిల్లా అందత్వ నియంత్రణ సంస్థ వారు శివకుమార్ నేత్రదాన బృంద అధికారిని పంపించి కొట్ర. వెంకటేశ్వర్లవి రెండు నేత్రాలలోని కార్నియాలను సేకరించారు. నేత్రధికారి కొట్ర బాలాజీ మాట్లాడుతూ నేత్రదానం మహాదానం అని, ప్రతి ఒక్కరూ దీనిని స్ఫూర్తిగా తీసుకొని, మృతి చెందిన తర్వాత నేత్రాలను దానం చేయాలని కోరారు. ఎవరైనా మృతి చెందిన తర్వాత నేత్రదానం చేయాలంటే వెంటనే వైద్య ఆరోగ్య శాఖ వారికి సమాచారం ఇవ్వాలని, మృతి చెందిన తర్వాత కేవలం 6గంటల లోపే నేత్రదానం చేయడానికి అర్హులని, మృతి చెందిన వారి తలకింద దిండు పెట్టాలని, తడి ఆరిపోకుండా రెండు కళ్ళపై దూది నీళ్లలో ముంచి కండ్లపై ఉంచాలని, ఆగదిలో ఫ్యాన్ వేయకూడదని, ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులకు నేత్రదాన దృవ పత్రమును అందజేశారు. ఈ కార్యక్రమంలో బొడ్డు రమణ, ఆలిశెట్టి, నరేష్, బిళ్ళకంటి హరిబాబు, రాధాకృష్ణ, ఆకారపు విశ్వనాథం వారి కుమారులు మధు, భరత్, మనోహర్, సుమన్, కూతురు కూన జయలక్ష్మి పాల్గొన్నారు.