ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం.!

 ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజం.!

ఎంఈవో రాoచందర్

మరికల్, జూన్ 28 (మనఊరు ప్రతినిధి): ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ సహజమని ఎంఈవో రాoచందర్ అన్నారు. శనివారం మరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నా జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు విజయలక్ష్మీ పదవీ విరమణ వీడ్కోలు సమావేశం శనివారం పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో ఎందరెందరో విద్యార్థులను జాతి గర్వించే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దిన జీవశాస్త్రం ఉపాధ్యాయురాలు విజయలక్ష్మీ విధి నిర్వహణను మించిన దేశసేవ లేదని తపించి సమయపాలన, అంకితభావంతో విధులు నిర్వహించి ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఎక్కడ పనిచేసినా విద్యార్థులకు మంచి విద్యాబుద్దులు నేర్పి సమాజంలో గౌరవం పొందాలని అపుడే జీవితం సార్తకమౌతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం సర్వమంగళ, కులకచర్ల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామ్మోహన్ శర్మ, గ్రామ పెద్దలు నర్సింహ్మారెడ్డి, దామోదర్ రెడ్డి, పాండురంగయ్య, యూసుఫ్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్ పర్సన్ అంజమ్మ, ఉపాధ్యాయులు సరస్వతి, శైలజ, మల్లప్ప, వెంకటయ్య, మల్లయ్య, రామక్రిష్ణ, హన్మయ్య, శశిదర్, పాండురంగయ్యచారి, శివప్రసాద్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post