గుడ్లు తినకుండా పారవేస్తున్న బాలింతలు, గర్భిణులు

 *అంగన్వాడి కేంద్రాల్లో కుళ్ళిపోయిన గుడ్లు* 

 *చింతకుంటపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రంలో ఘటన* 

 *గర్భిణీ స్త్రీలకు, చిన్నారి విద్యార్థులకు ఈ గుడ్లు సురక్షితమేనా..?* 

 *కమీషన్లకు ఆశపడి పట్టించుకోని అధికారులు* 

 *గుడ్లు తినకుండా పారవేస్తున్న బాలింతలు, గర్భిణులు


కేశంపేట, జూన్ 21 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలంలో అంగన్‌ వాడీ కేంద్రాలకు కుళ్లిన, నాసిరకం గుడ్లను సరఫరా చేస్తున్నారు. ఇటీవలే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటుండగా, సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టర్‌ ఇచ్చే మామూళ్లకు ఆశపడే అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తోంది. గుడ్లు, పాలతో పాటు పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇస్తోంది. గుడ్డు నుంచి పోషకాలు బాగా అందాలంటే దాని బరువు కనీసం 44 గ్రాముల నుంచి 50 గ్రాముల బరువు ఉండాలని సూచించింది. ఒక ట్రేలో ఉన్న గుడ్ల బరువు దాదాపు కిలోన్నర ఉండాలి. కానీ కాంట్రాక్టర్లు 30 గ్రాముల కన్నా తక్కువ బరు వున్న, కుళ్లిన గుడ్లను కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం గుడ్డుపై ప్రభుత్వ లోగోతో సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేసినా, కాంట్రాక్టర్లు మాత్రం చేతివాటాన్ని ప్రదర్శిస్తునే ఉన్నారు అనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనం. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం చింతకుంటపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రానికి సరఫరా చేసే కూలిన గుడ్ల వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. చింతకుంటపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి పూజ కుమారుడు అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్నాడు. ఇందుకోసం గుడ్ల ట్రైను అందజేశారు. గుడ్లను పగలగొట్టి చూస్తే అన్ని కుళ్ళిపోయినవే కనిపించడం గమనార్హం. ఉడకబెట్టిన గుడ్లు కూడా చెడిపోవడంతో మొత్తం గుడ్లు పగలగొట్టి చూడగా ఇదే పరిస్థితి కనిపించింది. గుడ్లను పంపిణీ చేసి వైపు గర్బిని పాలింత స్త్రీలకు సరఫరా చేయడం అదేవిధంగా చిన్నారి విద్యార్థినీ విద్యార్థులకు ఈ గుడ్లు అంటగట్టడం ఎంతవరకు సమంజసం అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ గుడ్లు తింటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా చింతకుంటపల్లి అంగన్వాడి కేంద్రానికి గత రెండు సంవత్సరాలుగా టీచర్ లేదు. ముఖ్యంగా ఇక్కడ పనిచేసే టీచర్ శ్రీదేవి ఇటీవలే వేరే ఉద్యోగం రాగా ఆమె వెళ్లిపోయారు. గుడ్ల పంపిణీలు ఇలాంటి అవకతవకలు జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రానికి ఓ టీచర్ అమ్మను కూడా నియమించాల్సిన అవసరం అధికారులపై ఉంది. కమిషన్లకు ఆశపడి కొందరు ఇలాంటి తతంగాన్ని నడిపిస్తున్నారని విమర్శలు బయలుదేరాయి. మండలంలో చాలాచోట్ల కూలిపోయిన గుడ్లను తినకుండా పారవేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరోవైపు ఈ గుడ్డను పంపిణీ చేస్తున్న కాంట్రాక్టర్ మాత్రం కొంతమంది చేతులు తడుపుతున్నట్టు తెలుస్తుంది.

*కుళ్లిపోయిన గుడ్లను రిటర్న్ చేసాం* 


 *షాద్ నగర్ ఐసిడిఎస్ సిడిపిఓ పి. ఉదయ వెల్లడి* 


 *"అంగన్వాడీలో కుళ్లిపోయిన గుడ్లు" కథనంపై స్పందన* 


 *నాణ్యమైన గుడ్లని సరఫరా చేస్తామని వెల్లడి* 


కేశంపేట, జూన్ 21 (మనఊరు ప్రతినిధి):

షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం చింతకుంటపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఓ విద్యార్థికి కుళ్ళిన గుడ్లు వచ్చిన నేపథ్యంలో అంగన్వాడి కేంద్రంలో కుళ్ళిన గుడ్లు అనే కథనం హలో షాద్ నగర్ సోషల్ మీడియాలోవార్త వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విషయమై షాద్ నగర్ ఐసిడిఎస్ సిడిపిఓ పి. ఉదయ శనివారం సాయంత్రం స్పందించారు. చింతకుంటపల్లి అంగన్వాడి కేంద్రానికి కుళ్ళిపోయిన కోడిగుడ్లు వచ్చాయని ఈ విషయమై అంగన్వాడి సహాయకురాలు సూపర్వైజర్ దృష్టికి తీసుకురాగా కుళ్లిపోయిన కోడిగుడ్ల స్థానంలో అంగన్వాడి కేంద్రానికి మొత్తం 505 గుడ్లు వచ్చాయని తెలిపారు. ఈ విషయమై కాంట్రాక్టర్ ను కూడా మందలించడం జరిగిందని పేర్కొన్నారు. కూలిపోయిన కోడిగుడ్లను తిరిగి ఇచ్చిన నేపథ్యంలో పొరపాటున అంగన్వాడి కేంద్రం సహాయకురాలు ఈ గుడ్లను ఎలా సరఫరా చేశారు తెలియదని స్పష్టం చేశారు. సదరు కాంట్రాక్టర్ ను కూడా ఈ విషయమే మందలించినట్లు సిడిపిఓ ఉదయ తెలిపారు. మరోసారి ఇలాంటి కూలిపోయిన కోడిగుడ్లను తీసుకువస్తే టెండర్ రద్దు చేస్తానని హెచ్చరించినట్లు ఆమె తన వివరణ ఇచ్చారు. అదేవిధంగా గుడ్ల సైజు చిన్నగా ఉన్నా, నాణ్యత లేకపోయినా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

Previous Post Next Post