ఏసీబీ వలలో చిక్కిన ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీ శ్రీనివాస్
విజయవాడ, ఆగస్టు 7 (మనఊరు ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో ఓ ఉన్నత స్థాయి అధికారి అవినీతి బాగోతం బట్టబయలైంది. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ ఏసీబీ అధికారులకు చిక్కారు.
గుత్తేదారు కృష్ణంరాజు నుంచి రూ.25లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. గుత్తేదారు ఆయనకు ఇప్పటికే రూ.25లక్షలు చెల్లించారు. మరో రూ.25లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ కోరడంతో కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎన్సీని పట్టుకున్నారు. ఆ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ఈఎన్సీ) అబ్బవరపు శ్రీనివాస్ను ఎసిబి అధికారులు విజయవాడలో అరెస్ట్ చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 25 లక్షల లంచం తీసుకుం టుండగా ఆయన రెడ్ హ్యాండెడ్గా పట్టుబడటం సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే రాష్ట్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన నిర్మాణ పనుల బిల్లులను మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ కృష్ణంరాజు నుంచి ఈఎన్సీ శ్రీనివాస్ లంచం డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపు కోసం మొత్తం రూ. 50 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా గుత్తేదారు ఇప్పటికే రూ. 25 లక్షలు చెల్లించారు. అయితే, మిగిలిన రూ. 25 లక్షల కోసం శ్రీనివాస్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో, వేధింపులు తట్టుకోలేక కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఎసిబి అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్ని ముందుగా చేసు కున్న ఒప్పందం ప్రకారం గురువారం శ్రీనివాస్ రూ. 25 లక్షల నగదును స్వీకరిస్తున్న సమయంలో అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన శాఖలో ఇంజనీర్-ఇన్-చీఫ్ స్థాయి అధికారి లంచం కేసులో పట్టుబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.