* _గుడ్న్యూస్.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం.. ఒకేసారి మూడు నెలల రేషన్..!!_*
హైదరాబాద్: వర్షాకాలంలో తిండి గింజల నిల్వ, రవాణాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. చేసింది.
జూన్ నుంచి మొదలయ్యే వర్షాకాలం, వరదల రాష్ట్రాలకు అడ్డంకులుగా మారవచ్చన్న అంచనాల నేపథ్యంలో, అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ ఆహారాలు భద్రత చట్టం కింద 2025 వరకు అవసరమైన తిండి ధాన్యాలను ముందుగానే లిఫ్ట్ చేసి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. మూడు కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాహుల్ సింగ్ లేఖ రాశారు. మే 30లోగా జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సరకు లబ్ధిదారులకు అందించాలని సూచించారు. ముందస్తు బియ్యం లిఫ్టింగ్, పంపిణీ ప్రక్రియలో భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం అవసరమైన చర్యలు కూడా చేపట్టారు. ఈ ఉత్త ర్వులు సంబంధిత అధికారుల అనుమతి మేరకు తక్షణం అమల్లోకి వచ్చారు.
*_రాష్ట్రంలో జూన్లోనే 3 నెలల సరఫరా_*
ఏప్రిల్ కోటా రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చే జూన్లో మూడు నెలల కోటాను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ప్రతినెల 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమైన మూడు నెలలకు సంబంధించి సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న కారణంగా వచ్చే గోడౌన్ల నుంచి సన్న బియ్యం నిల్వలను సమీకరించి నెలలో మూడు నెలల రేషన్ కోటాను విడుదల చేసింది పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది.