ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే ఊరుకోం

 ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తే ఊరుకోం

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి 

మిడ్జిల్, మే 31 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి హెచ్చరించారు. మిడ్జీల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు అల్వాల్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్న ఎమ్మెల్యేను కావాలనే ప్రతిపక్ష పార్టీల నాయకులు నాటకమాడుతున్నారని పేర్కొన్నా రు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధిని చూసి ఓర్వలేక అనవసరమైన విషయాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. ఇకముందు ఎవరైనా లేని విషయాన్ని రాద్ధ్దాంతం చేస్తే ఊరుకునేది లేదన్నారు. అభివృద్ధి విషయంలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మిడ్జిల్ మండలానికి కావలసిన పాఠశాలలు, సిసి రోడ్లు, బీటీ రోడ్డు, సబ్ స్టేషన్లన్లు ఎన్నో నిర్మాణ కార్యక్రమాలను చేపట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. మీరు గత 10 సంవత్సరాలలో ఏమి చేశారో ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మీరు చేసినటువంటి విధ్వంస పాలను గుర్తుచేసుకొని మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఇప్పటికైనా మారకపోవడం దురదృష్టకరమని అన్నారు. గత పాలనలో ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డులు, పేదలకు ఇండ్లు ఇవ్వని ప్రభుత్వం మా ప్రజా పరిపాలనలో ఇండ్లు లేని నిరుపేదలకు మొదటగా నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నామని ఇప్పుడు రాణి కొందరికి కూడా రెండో విడతలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అవుతాయని, ఎవరు కూడా మనస్థాపానికి గురికాకుండా ఉండాలని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదలకు సన్నబియ్యం ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సన్నబియ్యం తినాలనే సంకల్పంతోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఇసుక విషయంలో మండల పార్టీ నాయకులుగాని ఎమ్మెల్యే ఎవరికి కూడా సహకరించడం లేదని, లేనిపోని విమర్శలు చేయడం ప్రతిపక్ష నాయకులు తగదని హెచ్చరించారు. మా నాయకుడు ప్రతినిత్యం ప్రజల కోసం పనిచేసే నాయకుడని అన్నారు. ప్రచార సమయంలో దుందిబి నది నుంచి ఇసుకను తరలించబోమని, మాట ఇచ్చాడని ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నారని అన్నారు. ప్రజా పాలన రైతులు, మహిళలు, ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రతిపక్ష నాయకులు అపోహలు చేంద వదని హితవు పలికారు. మిడ్జిల్ మండల నాయకులపై ఇసుక విషయంలో లేనిపోని అవాస్తవాలను చెప్పినట్లయితే రాబోయే రోజుల్లో మా కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారని వారిని హెచ్చరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తన సొంత డబ్బులతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు బ్రాండెడ్ షూ, పదో తరగతి విద్యార్థులకు పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవాలని పుస్తకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎమ్మెల్యేకు పేదల పైన ఉన్న అపారమైన ప్రేమతో వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి కష్టసుఖాలను పాలు పంచుకోవడంలో ముందున్నారని అన్నారు. గత పది సంవత్సరాలలో ఏనాడైనా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకు సహాయం చేసినటువంటి పాపన పోలేదన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తమ ఎమ్మెల్యే చేస్తుంటే మీరు చూసి ఓర్వలేక ఆయన పైన లేనిపోని నిందలు వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గౌస్, మాజీ సర్పంచ్ శారద వెంకటయ్య, వల్లభరావు పల్లి మాజీ ఎంపీటీసీ నరసింహ, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యం, కాంగ్రెస్ పార్టీ నాయకులు విజయకుమార్, మల్లికార్జున్ రెడ్డి, సాయిలు, శంకర్ ముదిరాజ్, రామ్ గౌడ్, ఉస్మాన్, పర్వతాలులు పాల్గొన్నారు.

Previous Post Next Post