సకిలీ విత్తనాల కేంద్రంగా గోప్లాపూర్?
20 ఎకరాలలో ప్రారంభమై 100 ఎకరాలకు,
అమాయక రైతులను మభ్యపెట్టి, భయపెట్టి భూములను కొనుగోలు చేశారు
భూధాన్ భూములకు సైతం ఎసరు
ఆర్థిక బలం ఉంటే ఏదైనా చేయవచ్చు అంటున్న సామాన్యులు
జడ్చర్ల రూరల్, మే 31 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల సంస్థ గోష్ణాపూర్ గ్రామం నకిలీ విత్తనాలు కేంద్రంగా మారుతుందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వహించిన భూత్పూర్ వద్ద ఉన్న విత్తన కంపెనీలలో కొన్ని రైతుల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. ఈ కంపెనీనే రెండు కంపెనీలు గోస్లాపూర్, గంగాపూర్ శివారు కేంద్రంగా మార్చుకున్నారు. ఒక కంపెనీ మొదట 20 ఎకరాల్లో ప్రారంభించి నేడు 100 ఎకరాలకు మించి విస్తరించింది. రెండవ కంపెనీ 7, 8 ఎకరాలలో ప్రారంభమై కొద్ది కాలంలోనే 25 ఎకరాలకు విస్తరించింది. రెండు కంపెనీలు ప్రారంభం కావడంతో ఈ ప్రాంతంలో నకిలీ విత్తనాల జోరు పెరిగిందన్న విమర్శలు పెరిగాయి. గత ఏడాది ఈ ఏడాది ఆ గ్రామంలో నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. అందుకని గోప్లాపూర్ గ్రామం నకిలీ విత్తనాలు కేంద్రంగా మారనుందా అన్న అనుమానాలు రైతులలో వస్తున్నాయి. రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు సదరు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినవస్తున్నాయి.
*సామాన్య రైతులను భయపెట్టి భూములు కొనుగోలు*
విత్తనాల కంపెనీలు తమ సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు గ్రామములోని భూస్వాములను, రియల్ వ్యాపారులను అక్కున చేర్చుకుంటున్నారు. వారి ద్వారా పొలము చుట్టూ ఉన్న రైతులను సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి వారిని అమ్మేలా చేసుకుంటున్నారు. ముందుగా చిన్నా, చితక రైతుల బలహీనతలను రియల్ వ్యాపారుల ద్వారా తెలుసుకొని, వారిని బెదిరించి భూములను అమ్మేలా వత్తిడి తెచ్చి విజయవంతం అవుతున్నారు. విమర్శలు వస్తున్నాయి. విత్తనాల కంపెనీ భూదాహానికి పరిసరాల చిన్న రైతులు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే భూములు కోల్పోయిన రైతులు ఆ కంపెనీలకే కూలీ పనులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్షర జ్ఞానం లేని చిన్నా, చితక అమాయక రైతులు ఇందుకు బలవుతున్నారు. దళారుల నుంచి కొనుగోలు చేసే భూములు కొన్ని అసైన్డ్ భూములు ఉన్నాయి. అసైన్డ్ భూములు కొనుగోలు చేయరాదనే విషయం తుంగలో తొక్కారు. వ్యాపారం పేరుతో బ్రతకడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడి రైతుల బ్రతుకులు వలస వెళ్లిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
*ఇలావెలుగులోకి*
కంపెనీ భూదాహం ఇలా వెలుగు చూసింది. భూదాన భూమిలో కొంత ఖబ్జా చేసి సదరు విత్తనాల కంపెనీ నిర్వాహకులు భూదాన భూమికి కంచె వేసి వెనుక ఉన్న రెండు ఎకరాల రైతులకు దారి లేకుండా చేసారు. రెండేళ్ళు ఓర్పు వహించిన తనకు జరుగుచున్న అన్యాయాన్ని ఇతరులతో పంచుకోవడంతో ఆనోట ఈనోట కంపెనీల అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. అనేక ఆసక్తికరమైన విషయాలు బహిర్గతమౌతాయి.
*ఏం చేయాలి?*
రైతులను ఇబ్బంది పెడుతున్న విత్తనాల కంపెనీలపై తరచుగా దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను అరికట్టాలి. ఇందుకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే జరిగిన భూలావాదేవీలపై శాఖాధికారులు విచారించాల్సిన అవసరం ఉంది. రైతులను ఇబ్బంది పెట్టి అసైన్డ్ భూములు కొని ఉంటే అట్టి భూములను తిరిగి అదే రైతులకు ఇప్పించేందుకు చర్యలు చేపట్టాలి.
*భూదాన భూములను ప్రభుత్వము స్వాధీనము చేసుకోవాలి*
గంగాపూర్ శివారులో ఉన్న భూదాన్ భూమిలో కొంత భాగానికి కంచె వేసి వెనుక రైతుకు బాట లేకుండా మిగిలిన భూమి సాగు చేస్తున్నారు. ఆ భూమిని ప్రభుత్వము స్వాధీనము చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలని ప్రజలు కోరుతున్నారు. దాదాపు ఎ. 10-25 గుంటల భూదాన్ భూమి అన్యాక్రాంతం అయి ఉంది. ఇట్టి స్థలములో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థానిక శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డిని క్రీడాభిమానులు కోరుతున్నారు. అన్యాయాలను ఎక్కడ జరగకుండా అరికట్టే మహనీయుడు అనిరుధ్ రెడ్డి అని యువత బావిస్తున్నారు. క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేస్తాడనే యువత నమ్మకం ఏర్పడింది.
*ఆర్థిక బలముంటే ఏమైనా చేయవచ్చా?*
ఆర్థిక బలముంటే ఏమైనా చేయమని సదరు కంపెనీ నిర్వాహకులు నిరూపిస్తున్నారు. దళారులను అడ్డము పెట్టుకొని వారికి డబ్బులను ఎరగా వేసి అమాయక ప్రజల నుంచి గైరాన్ భూములు, పట్టా భూములను బలవంతంగా కొనుక్కోవడం ఇందుకు నిదర్శనం. పూర్తి స్థాయిలో అవినీతిని వ్యతిరేకిస్తున్న స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవ తీసుకొని రైతులకు జరుగుతున్న అన్యాయాలపై దళారుల ప్రమేయం లేకుండా దర్యాప్తు జరిపిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. లేదంటే కంపెనీల భూదాహానికి మరికొంత మంది రైతులు మోసపోయి, భూములు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దానితో పాటు కంపెనీలు ఇక్కడకు వచ్చే ప్రమాదం ఉంది.