స్వర్ణకారుల జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యం
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్.లోక్ నాథ్ రెడ్డి
వనపర్తి, మే 25 (మనఊరు ప్రతినిధి): స్వర్ణకారుల జీవితాల్లో వెలుగు నింపడమే తమ లక్ష్యమని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఆర్.లోక్ నాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం విశ్వబ్రాహ్మణులు స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు ఆయన హజరై మాట్లాడారు. స్వర్ణకారులు అనేక ఇబ్బందులతో గురవుతున్నారని వారిని దృష్టిలో పెట్టుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో స్వర్ణకారుల జీవితాల్లో వెలుగు నింపడానికి కేంద్ర ప్రభుత్వం పరంగా స్కిల్ డెవలప్మెంట్ స్కీములు తీసుకొచ్చి మీ జీవితాల్లో వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, వనపర్తి పట్టణ స్వర్ణకారుల అధ్యక్షులు, బులియన్ మర్చంట్ అధ్యక్షులు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ నెంబర్ గంధం నాగరాజు, పాల్గొన్నారు.