మోతేలో టైర్ పేలి ప్రవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం?
సూర్యాపేట, మే 30 (మనఊరు ప్రతినిధి): సూర్యాపేట జిల్లా మోతే మండలంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ ప్రమాదం తప్పింది. సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రం సమీపంలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై బస్సు దగ్ధమైంది. ఖమ్మం వెళ్తుండగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలి మంటలు చెలరేగాయి. అనంతరం మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో డ్రైవర్ ఒకరే ఉండటం, బస్సు నుంచి దూకేయడంతో ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
ప్రవేట్ ట్రావెల్ బస్సు టైర్ ఒక్కసారిగా పేలడంతో బస్సులో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్.. బస్సులోంచి దూకి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఫైరింజన్ల సాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు.